
కానిస్టేబుల్ మృతికి సంతాపం
జి.సిగడాం: స్థానిక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న వల్లంశెట్టి లోకేష్(38) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. ఇతని స్వగ్రా మం విజయనగరం జిల్లా జామి మండలం అట్టాడ. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విశాఖలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతిచెందారు. లోకేష్కు భార్య అచ్చయ్యమ్మ, కుమారుడు దివిన్, కుమార్తె భవిశ్రీ ఉన్నారు. లోకేష్ మృతి పట్ల రణస్థలం సీఐ అవతారం, ఎస్ఐ వై.మధుసూదనరావు, ఏఎస్ఐలు పొగిరి శంకరరావు, కోరుకొండ రామకృష్ణ, సిబ్బంది సంతాపం తెలిపారు.
వెబ్సైట్లో ల్యాబ్టెక్నీషియన్ పోస్టుల జాబితా
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్టుల భర్తీకి సంబంధించి ఐదుకేటగిరీలకు చెందిన ప్రొవిజినల్ మెరిట్ జాబితాను విజయనగరం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, పీఈటీ, ల్యాబ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ గ్రేడ్–3 పోస్టులకు సంబంధించిన ప్రొవిజినల్ మెరిట్ జాబితాను వెబ్సైట్లో పెట్టారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే 28 నుంచి 31 వతేదీ వరకు, 2 వతేదీ నుంచి నాలుగో తేదీ వరకు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటలులోగా తెలియజేయాలని సూచించారు.
పైడిమాంబ చిత్రం రెండో షెడ్యూల్కు రెడీ
విజయనగరం టౌన్: శ్రీపైడిమాంబ ఆధ్యాత్మిక కళానికేతన్, జ్ఞానభేరి సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్న జై పైడిమాంబ చిత్రం రెండో షెడ్యూల్కు సిద్ధమవుతున్నట్లు కళానికేతన్ వ్యవస్థాపకుడు ఆర్.సూర్యపాత్రో పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక లేడీస్ రిక్రియేషన్ క్లబ్ ఆవరణలో మంగళవారం చిత్రయూనిట్, స్థానిక పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిషెడ్యల్లో చిత్రం బాగా వచ్చిందన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి చిత్రపటాలను, ప్రసాదాలను చిత్ర యూనిట్కు అందజేశారు. కార్యక్రమంలో నటులు రవితేజ, డాక్టర్ మురళీధర్, పెద్దింటి అప్పారావు, డాక్టర్ జక్కు రామకృష్ణ, అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.