
సాహిత్యం, కళలను ప్రోత్సహిస్తాం
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ● పాడుదుమా.. స్వేచ్ఛాగీతం పుస్తకావిష్కరణ
విజయనగరం టౌన్: సాహిత్యం, కళలకు ఎల్లప్పుడూ వెన్నుదన్ను గా నిలుస్తానని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో ప్రముఖ కవి గంటేడ గౌరునాయుడు రాసిన పాడుదుమా.. స్వేచ్ఛాగీతం పుస్తకాన్ని సాహితీ వేత్తలతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళలకు పుట్టినిల్లు అయిన గురజాడ, ద్వారం, ఘంటసాల, సుశీలమ్మ వంటి ఉద్దండులు నడయాడిన ఈ నేల ఎంతో ప్రశస్తమై నదని కొనియాడారు. సాహిత్యాన్ని, కళలను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. తమ వంతుగా వీటిని నిరంత రం ప్రోత్సహిస్తున్నామని, భవిష్యత్తులోనూ కొనసాగుతుందని హామీనిచ్చారు. గంటేడ రాసిన పుస్తకా న్ని జెడ్పీ పాఠశాలల్లో, గ్రంథాలయాల్లో విద్యార్థుల కు అందుబాటులో ఉంచుతామన్నారు. ఉత్తరాంధ్ర కవులు, కళాకారులకు సముచిత గౌరవాన్ని కల్పించేందుకు కృషి చేస్తామని హామీనిచ్చారు. సాహితీ స్రవంతి నిర్వహకులు చీకటి దివాకర్, చంద్రికారాణిల ఆధ్వర్యంలో వారి కుమారుడు రవితేజ, కోడలు వైష్ణవిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వినూత్నంగా సాహితీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్, కవి డాక్టర్ డివిజి.శంకరరావు, ప్రముఖ కవులు గంటేడ గౌరు నాయుడు, అట్టాడ అప్పలనాయుడు, ప్రముఖ వయోలిన్ విద్వాంసులు ద్వారం దుర్గాప్రసాదరా వు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్.శర్మ, ప్రముఖ సీ్త్ర వైద్య నిపుణురాలు డాక్టర్ గేదెల సన్యాసమ్మ, కవులు, కళాకారులు పాల్గొన్నారు.