
ప్రజల భాగస్వామ్యంతోనే పర్యావరణ పరిరక్షణ
సీతానగరం: ప్రజల భాగస్వామ్యంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ పేర్కొన్నారు. సీతానగరం మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలతో పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నిషేధించాలని పిలుపునిచ్చారు. అనంతరం స్థానిక పీహెచ్సీని పరిశీలించి మెరుగైన వైద్యసేవలు అందజేయాలని వైద్యులు ఉషారాణి, పావనికి సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసన్నకుమార్, ఎంపీడీఓ త్రివిక్రమరావు, ఎకై ్సజ్ సీఐ పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో..
పార్వతీపురం రూరల్: స్వచ్ఛ దివస్లో భాగంగా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ ప్రక్రియలో సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది భాగస్వాములయ్యారు.
ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో ఆరోగ్యానికి హానికరం
పార్వతీపురంటౌన్: ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో ఆరోగ్యానికి హానికరమని జిల్లా ప్రత్యేకాధికారి నారాయణ భరత్ గుప్త అన్నారు. ఈ మేరకు శనివారం నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ–వేస్ట్ చెత్త సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, విస్మరించిన విద్యుత్ పరికరాలతో ఆరోగ్యం, పర్యావరణంపై హానికర ప్రభావం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ఎస్ శోభిక, డీఆర్ఓ హేమలత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రజల భాగస్వామ్యంతోనే పర్యావరణ పరిరక్షణ