పేద పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య | - | Sakshi
Sakshi News home page

పేద పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య

Mar 25 2023 1:54 AM | Updated on Mar 25 2023 1:54 AM

విజయనగరం పూల్‌బాగ్‌: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పేదకుటుంబాల పిల్లలకు ప్రైవేటు పాఠశాల ల్లో 25 శాతం సీట్లు కేటాయించినట్టు కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి తెలిపారు. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 12(సి) ద్వారా 5 నుంచి 6 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకు ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు www.cre.ap.gov.in/QTE వెబ్‌సైట్‌లో గానీ, గ్రామ /వార్డు సచివాలయాల్లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 22 నుంచి ఏప్రిల్‌ 10వ తేదీ వరకు ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. దీనిపై ఏమైనా సందేహాలుంటే ప్రభుత్వ టోల్‌ఫ్రీ నంబర్‌ 14417ను సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement