
కుట్రదారుల పాలిట సింహస్వప్నం వైఎస్ జగన్
నరసరావుపేట: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి భూతమని ఒక కొత్త పేరు పెట్టి, ఆ భూతాన్ని భూస్థాపితం చేసేపనిలో ఉన్నామని నాలుగోసారి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబునాయుడు నేరపూరితంగా, సంస్కారహీనంగా మాట్లాడటం.. దానికి తానా తందానా అంటూ అనుకూల మీడియా వంతపాడడం, భూస్థాపితం ఎప్పుడు చేస్తారు, ఈ ఐదేళ్లలోనేనా అని పాత్రికేయతకే మచ్చతెచ్చేలాగా ఆ మీడియా ప్రశ్నించడం చాలా అభ్యంతరకరం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి కళంకమని సోషల్ యాక్టివిస్టు ఈదర గోపీచంద్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారంలో ఉండగా తాను ప్రజలకిచ్చిన ఎన్నికల వాగ్దానం ప్రకారం నవరత్న సంక్షేమ పథకాలను ఠంఛనుగా ఐదేళ్లూ అందించడమే కాక, చరిత్రలో నిలిచిపోయే పలు అభివృద్ధి కార్యక్రమాలను చేసి చూపిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. గత ఐదేళ్లుగా ఆయన్ను విధ్వంసకారుడు అని తమ అనుకూల మీడియా ద్వారా కూటమి నేతలు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. కూటమి పేరిట అనైతిక పొత్తులు పెట్టుకుని, ఈవీఎంలతో సహా వ్యవస్థలను మేనేజ్ చేసి, గెలిచిన గెలుపూ ఒక గెలుపేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు.
ఇకనైనా బాబు
బుద్ధి తెచ్చుకోవాలి
మరో పక్క వైఎస్ జగన్ ఓడినప్పటికీ నీతికి నిలబడి గెలిచాడని, కోట్లాది జన హృదయాలలో నిలిచాడన్నారు. అందుకనే వైఎస్ జగన్ కుట్రదారుల పాలిట సింహ స్వప్నమయ్యాడని తెలిపారు. 164 సీట్లు సాధించినా కూటమి నాయకులకు మనశ్శాంతి కరువైందన్నారు. పెట్టుబడుల సదస్సుల్లో కూడా వైఎస్ జగన్పై నిందలు వేయటం వారి కుసంస్కారానికి నిదర్శనమన్నారు. ర్యాలీ ప్రమాదంలో సింగయ్య మరణాన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో కల్పించిన ఫేక్ వీడియోతో జగన్పైకి నెట్టి, జైలుపాలు చేయాలని చూడటం నీచ నికృష్ట రాజకీయానికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు వేసిన మొట్టికాయలకై నా బాబు బుద్ధి తెచ్చుకుని కక్షపూరిత రాజకీయాలకు, రెడ్బుక్ రౌడీయిజానికి స్వస్తి చెప్పి, మొదటి ఏడాది బాకీపడ్డ సూపర్సిక్స్ పథకాలను వడ్డీతో సహా ప్రజలకు అందజేయాల్సిందిగా డిమాండ్ చేశారు.
సోషల్ మీడియా యాక్టివిస్ట్
ఈదర గోపీచంద్