అర్జీ ఇచ్చినా పట్టించుకోవట్లేదు | - | Sakshi
Sakshi News home page

అర్జీ ఇచ్చినా పట్టించుకోవట్లేదు

Jun 3 2025 5:29 AM | Updated on Jun 3 2025 5:29 AM

అర్జీ ఇచ్చినా పట్టించుకోవట్లేదు

అర్జీ ఇచ్చినా పట్టించుకోవట్లేదు

నాకు వారసత్వంగా లభించే పొలాన్ని వేరే వ్యక్తులు అక్రమంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకొని పాస్‌బుక్‌లు పొందారు. వాటిని రద్దుచేసి ఆ పొలాన్ని హక్కుదారైన నా అత్తపేరుపై పెట్టించా. పాస్‌బుక్‌లు మంజూరు చేశారు. ఆమె తదనంతరం ఆ పొలం హక్కుదారులం మేమే. ఆమె మృతి చెందింది. అయితే ఆ పొలాన్ని ఆన్‌లైన్‌లోకి ఎక్కించుకున్న వారు కోర్టుకు ఎక్కారు. ఎటువంటి హక్కులు లేని వ్యక్తులు పొలంలోకి మేము వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. వేసిన పంటను ధ్వంసం చేస్తున్నారు. దీనిపై 2024లో రెండుమార్లు అర్జీ అందజేశా. అధికారుల నుంచి సరైన స్పందనలేదు. మంగళగిరి వెళ్లి టీడీపీ కార్యాలయంలో అర్జీ అందజేశా. అక్కడి నుంచి ఫోన్‌చేసి రెవెన్యూ అధికారులకు చెప్పారు. అయినా ఇక్కడ అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదు. అందువలన మూడోసారి మళ్లీ అర్జీ అందజేస్తున్నా.

–ఉన్నం నాగేశ్వరరావు, ధర్మవరం గ్రామం, దుర్గి మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement