క్రీడాకారులను తీర్చిదిద్దడం గొప్ప విషయం | - | Sakshi
Sakshi News home page

క్రీడాకారులను తీర్చిదిద్దడం గొప్ప విషయం

Jun 2 2025 2:01 AM | Updated on Jun 2 2025 2:01 AM

క్రీడాకారులను తీర్చిదిద్దడం గొప్ప విషయం

క్రీడాకారులను తీర్చిదిద్దడం గొప్ప విషయం

చినగంజాం: క్రీడాకారులను ప్రతిభావంతులుగా తీర్చి దిద్దడం గొప్ప విషయం అని హైదరాబాద్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ అన్ను వేణుగోపాల్‌ అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఎంఎస్‌ఆర్‌ జూనియర్‌ కాలేజీ ఆవరణలో 40 రోజులుగా నిర్వహిస్తున్న వేసవి కబడ్డీ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వేసవి శిక్షణ శిబిరానికి శిక్షకుడుగా అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులు గిరిబాబు వ్యవహరించి ప్రతి రోజూ శిక్షణ అందించారని, అనేక మంది యువ క్రీడాకారులు ప్రేరణ పొందారన్నారు. ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు మాట్లాడుతూ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 20 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు గ్రామీణ యువతకు కబడ్డీపై శిక్షణ ఇచ్చే కార్యక్రమం నిర్వహించామని.. శిబిరం విజయవంతంగా ముగిసిందన్నారు. కోచ్‌ గిరిబాబు మాట్లాడుతూ శిబిరంలో మొత్తం 150 మంది బాలలకు శిక్షణ ఇచ్చామని, శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు డాక్టర్‌ నల్లూరి సుబ్బారావు రూ.లక్ష విరాళంగా అందజేశారని తెలిపారు. దీంతో క్రీడాకారులకు పౌష్టికాహారం, కబడ్డీ కిట్‌లు అందజేశామన్నారు. శిబిరంలో సీనియర్‌ క్రీడాకారులు బి.నాగాంజనేయులు, వెంకటేశ్‌, కె.సతీష్‌రెడ్డి, బి.శివారెడ్డి, డి.సుబ్బారెడ్డి, వి. వెంకటేశ్‌, జీటీ అంకిరెడ్డి, ఎం.భాను ప్రకాష్‌రెడ్డి తదిరులు పాల్గొనగా, వారి సలహాలు సూచనల మేరకు శిక్షణ పూర్తి చేసినట్లు తెలిపారు. ముగింపు కార్యక్రమానికి, క్రీడాకారులకు భోజన వసతి కల్పించేందుకు అన్ను వేణుగోపాల్‌ రూ.40 వేలు ఆర్థిక సాయమందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మచిలీ పట్నం జిల్లా అదనపు పోలీస్‌ అధికారి సత్యం, ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ దాత డాక్టర్‌ నల్లూరి సుబ్బారావు, అసోసియేషన్‌ చైర్మన్‌ చంద్రమోహనరెడ్డి, అసోసియేషన్‌ కార్యదర్శి వై.పూర్ణచంద్రరావు, డి.రమేష్‌, డాక్టర్‌ రవిప్రకాష్‌ రెడ్డి, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సిరిగిరి రంగారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement