
ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు
శావల్యాపురం: ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ సిద్దా రామలింగామూర్తి అన్నారు. గురువారం మండలంలోని బొందిలిపాలెం, వేల్పూరు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలు పనులు చేస్తున్న ప్రదేశాల్లో మాత్రమే మస్టర్ నమోదు చేయాలన్నారు. గోకులం షెడ్లు బిల్లులు ఈనెలాఖరులోగా మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనతో పాటు ఎంపీడీవో పేరుమీనా సీతారామయ్య, ఏపీవో కె.రామారావు, ఫీల్డ్ అసిస్టెంట్లు చల్లగుండ్ల రాజా, మారుతీ తదితరులు ఉన్నారు.
డ్వామా పీడీ సిద్దా రామలింగమూర్తి