
బ్లాక్లో ఎరువులు కొనుగోలు
నేను 15 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశాను. దుక్కుల్లో వేసేందుకు యూరియా, డీఏపీ అవసరం కాగా దుకాణాల్లో కొరత ఏర్పడింది. దీంతో బ్లాక్లో బస్తాకు రూ.100 అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఆర్ఎస్కేలకు నామమాత్రంగా ఎరువులు వస్తున్నాయి. అక్కడ అందరికీ అందలేదు. రాష్ట్ర సర్కారు రైతులను ఆదుకోవాలి. విత్తనాలు, ఎరువులను సకాలంలో అందించాలి. గిట్టుబాటు ధరలు కల్పించడం ద్వారా అన్నదాతలకు కాస్త ఊరట లభిస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి.
– ఇగుటూరి కోటిరెడ్డి, రైతు, దొండపాడు, నరసరావుపేట మండలం