తిరగబడ్డ గ్రామస్తులు | - | Sakshi
Sakshi News home page

తిరగబడ్డ గ్రామస్తులు

May 29 2025 7:21 AM | Updated on May 29 2025 7:21 AM

తిరగబ

తిరగబడ్డ గ్రామస్తులు

గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025

అచ్చంపేట: ‘‘ప్రభుత్వం ట్రాక్టర్లకు ఉచితంగా ఇసుక తోలుకునేందుకు అనుమతించింది.. వాటిని ఆపడానికి మీరెవ్వరు..? ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను మీరు అతిక్రమిస్తారా.. అలాగైతే మీ లారీలనుకూడా మేం పోనివ్వమంటూ కోనూరు గ్రామస్తులు రహదారిపై రాళ్లు, టైర్లు అడ్డుగా బెట్టి టీడీపీ నేతలకు చెందిన లారీలను స్తంభింపజేశారు.’’ కోనూరు కృష్ణానదిలో నది లోపలవరకు రోడ్డు వేసి పెద్ద పెద్దయంత్రాలతో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారని విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గతంలో ఇసుక ర్యాంప్‌ను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజులు మాత్రమే ఆపగలిగిన అధికారులు అడ్డదార్లను పూర్తిగా నిలిపి వేయలేకపోయారు. మళ్లీ గత వారం రోజులుగా ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది.

మా దారి అడ్డదారి..

అయితే అడ్డదారుల్లో పెద్ద పెద్ద టిప్పర్లతో అడ్డదిడ్డంగా ఇసుకను తరలిస్తున్న టీడీపీ నేతలు స్థానికులు ట్రాక్టర్ల ద్వారా చేస్తున్న తరలింపును అడ్డుకుంటున్నారు. ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా ఇసుక రవాణా చేసుకోవచ్చంటూ సాక్షాత్తూ సీఎం చంద్రబాబు చెబుతుండగా స్థానిక టీడీపీ నేతలు అభ్యంతరం చెబుతుండడం విడ్డూరం. గ్రామంలో సుమారు 20 నుంచి 30 ట్రాక్టర్ల ద్వారా గ్రామస్తులు ఇసుక రవాణా చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరిలోనూ ఎక్కువగా టీడీపీ వారే ఉండటం గమనార్హం. వచ్చేది వర్షాకాలం కాబట్టి వర్షాలు కురిస్తే ఇసుక నిల్వ చేసుకునే అవకాశం లేనందున ఇసుకను డంపింగ్‌ చేసుకునేందుకు అనుమతులిచ్చారంటూ టీడీపీ నాయకులు గతంలో నదిలో అడ్డంగా వేసిన రోడ్లపైనుంచి యంత్రాల సహాయంతో నది ఒడ్డున ఇసుకను డంపింగ్‌ చేస్తున్నారు. ఈ ముసుగులోనే కొన్ని లారీలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదేమంటే రాజధాని నిర్మాణానికి తరలిస్తున్నామని చెబుతున్నారు.

అడ్డుతగిలితే కేసులంటూ హుకుం

అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు గ్రామస్తులను దారికి అడ్డుతగితే కేసులు మోపుతామని, దారికి అడ్డుపడే హక్కులేదంటూ హెచ్చరించారు. నదికి అడ్డుగా రోడ్డు వేసే హక్కు ఉందా అంటూ గ్రామస్తులు ప్రశ్నించగా, ఇదంతా మాకు తెలియదని, ఎమ్మెల్యేతో మాట్లాడి అనుమతి తెచ్చుకోండి.. అప్పుడు మీ ట్రాక్టర్లకు అనుమతిస్తామని సీఐ హుకుం జారీ చేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ట్రాక్టర్లకు అనుమతిచ్చినప్పుడు ఇంకా ఎమ్మెల్యే అనుమతులేంటి అంటూ గ్రామస్తులు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే టీడీపీ నాయకులకు, స్థానిక వైఎస్సార్‌ సీపీ నాయకులకు కొంత వాగ్వివాదం జరిగింది. అయితే గ్రామస్తులు ఎంత ఆందోళనలకు దిగినా చివరకు ఏమీ సాధించలేకపోయారు. ట్రాక్టర్ల ద్వారా ఇసుకను రవాణా చేసుకునే హక్కును పొందలేకపోయారు. భారీ ఇసుక లోడ్‌ లారీలు మాత్రం నదిలో వేసిన అడ్డదారిలో యథేచ్ఛగా తరలి వెళుతూనే ఉన్నాయి.

కోనూరులో దారికి అడ్డంగా గ్రామస్తులు రాళ్లు, టైర్లు పెట్టడంతో నిలిచిపోయిన ఇసుక లారీలు

న్యూస్‌రీల్‌

అచ్చంపేట మండలం కోనూరు

ఇసుక ర్యాంపు మూసేసిన అధికారులు

భారీ వాహనాలతో చాటుగా

ఇసుక తరలించేస్తున్న పచ్చనేతలు

ట్రాక్టర్ల ద్వారా తరలింపును

అడ్డుకుంటున్న అక్రమార్కులు

దీనికి ప్రతిగా ఇసుక లారీలను

అడ్డుకున్న కోనూరు గ్రామస్తులు

ట్రాక్టర్లను ఆపితే ఊరుకోమంటూ

గ్రామస్తులు ఆందోళన

టీడీపీ, వైఎస్సార్‌ సీపీ వర్గీయుల

మధ్య ఘర్షణ

గ్రామంలో ఇప్పటికి వరకు ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా జరగ్గా, ఎప్పుడైతే లారీలతో రవాణా మొదలుపెట్టారో అప్పటి నుంచి నదిలోకి ట్రాక్టర్లను అనుమతించడం నిలిపివేశారు. దీంతో గ్రామస్తులు తిరగబడ్డారు. లోడ్‌ చేసిన లారీలను పోనివ్వకుండా గ్రామనడిబొడ్డులో పెద్ద పెద్ద రాళ్లు, టైర్లు పెట్టి నిలిపి వేశారు. ట్రాక్టర్లను అనుమతించే వరకు లారీలను కూడా వెళ్లనివ్వమంటూ భీష్మించుకుని కూర్చుని ఆందోళన చేపట్టారు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను స్టేషన్‌కు పిలిపించారు. కొంతమంది గ్రామస్తులు అచ్చంపేట పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు.

తిరగబడ్డ గ్రామస్తులు 1
1/2

తిరగబడ్డ గ్రామస్తులు

తిరగబడ్డ గ్రామస్తులు 2
2/2

తిరగబడ్డ గ్రామస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement