అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

May 27 2025 1:52 AM | Updated on May 27 2025 1:52 AM

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు అధ్యక్షత వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 171 అర్జీలు స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌, డీఆర్‌ఓ ఏకా మురళి, డీఆర్‌డీఏ పీడీ ఝాన్సీరాణి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి.రవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

దివ్యాంగుడి సమస్య తెలుసుకున్న కలెక్టర్‌

బొల్లాపల్లికి చెందిన ఎం.సుధాకర్‌ అనే దివ్యాంగుడు పింఛన్‌ కోసం వీల్‌ఛైర్‌లో వచ్చాడు. కలెక్టర్‌ స్వయంగా అతని వద్దకు వెళ్లి సమస్య అడిగి తెలుసుకొని సెర్ఫ్‌ సీవోతో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజల నుంచి 171 అర్జీలు స్వీకరించిన

కలెక్టర్‌, అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement