
నృసింహస్వామి సేవలో దేవదాయ శాఖ కమిషనర్
మంగళగిరి: మంగళాద్రిలో గల శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ దంపతులు దర్శించుకున్నారు. ఆదివారం ఆలయానికి వచ్చిన కమిషనర్ దంపతులకు ఈవో అన్నపురెడ్డి రామకోటిరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలి కారు. దర్శనం అనంతరం స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశ్వీరచనాలు అంద జేశారు.
ముగిసిన హనుమాన్ దీక్షలు
నగరంపాలెం: స్థానిక మారుతీనగర్లోని శ్రీ కంచి కామకోటి పీఠ శ్రీమారుతీ దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న హనుమజ్జయంతి మహోత్సవాల్లో భాగంగా హనుమాన్ మండల వ్రత దీక్షలు ఆదివారంతో ముగిశాయి. హనుమత్ హవనం, మన్యుసూక్త హోమం, గణపతి హోమం నిర్వహించారు. దీక్షాధారులు ఇరుముడులు ధరించి ఆలయ ప్రదక్షిణలు అనంతరం మాల విరమణ చేశారు. సాయంకాలపు కార్యక్రమాల్లో భాగంగా మాస శివరాత్రి గంగా గౌరీ సమేత శంకరునికి ప్రదోషకాల అభిషే కం, కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు కొరపాటి రామారావు, ఆలయ కార్యదర్శి తంగిరాల శ్రీనివాస్, జిల్లా దేవాలయ పరిరక్షణ సమితి కార్యదర్శి నరేంద్రగౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
తెనాలి: పట్టణ నాజరుపేటలో వేంచేసియున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. శ్రీ శృంగేరీ శ్రీవిరూపాక్ష శ్రీపీఠం శ్రీసదనం శ్రీపరశివానంద భారతీస్వామి ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ కె.చంద్రశేఖరరెడ్డి పర్యవేక్షణలో స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.
గేట్ మేన్పై సస్పెన్షన్ వేటు
నాదెండ్ల: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సాతులూరు రైల్వే గేట్మేన్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నెల 23న ఉదయం 5 గంటల సమయంలో గుంటూరు నుంచి హుబ్లీ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు 15 నిమిషాలు ఆలస్యమైంది. సాతులూరు సమీపంలో మూడు రైల్వే గేట్లుండగా, 290–291 చందవరం–బుక్కాపురం రోడ్డు వద్ద గేట్లు వేశారు. 289 కనపర్రు రోడ్డు వద్ద వేయకపోవడంతో గూడ్స్ రైలు 15 నిమిషాలు నిలిచిపోయింది. గేట్మేన్ నిర్లక్ష్యంపై లోకో పైలట్ గుంటూరు స్టేషన్ మాస్టర్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు గేట్మేన్ ఆర్. కోటేశ్వరరావును రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. దీనిపై ముగ్గురు సభ్యుల కమిటీని విచారణకు నియమించారు.
తిరుపతమ్మ ఆలయంలో రద్దీ
పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీతిరుపతమ్మ దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు శుభకార్యాలు ఉండటంతో అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆలయ క్యూలు, పరిసరాలు కిక్కిరిశాయి. తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. తెల్లవారు జాము నుంచి సాయంత్రం వరకు వాహనాల రద్దీ కొనసాగింది. కొందరు భక్తులు మునేరు అవతల మామిడి తోటల్లో సందడి చేస్తూ వంటలు చేసుకుని భోజనాలు చేశారు.

నృసింహస్వామి సేవలో దేవదాయ శాఖ కమిషనర్

నృసింహస్వామి సేవలో దేవదాయ శాఖ కమిషనర్

నృసింహస్వామి సేవలో దేవదాయ శాఖ కమిషనర్