బాలుర వాలీబాల్‌ పోటీల విజేత సత్తెనపల్లి | - | Sakshi
Sakshi News home page

బాలుర వాలీబాల్‌ పోటీల విజేత సత్తెనపల్లి

Apr 28 2025 1:01 AM | Updated on Apr 28 2025 1:01 AM

బాలుర

బాలుర వాలీబాల్‌ పోటీల విజేత సత్తెనపల్లి

సత్తెనపల్లి: అండర్‌–17 బాలుర వాలీబాల్‌ పోటీల విజేతగా పీఎం శ్రీ కేవీ సత్తెనపల్లి సత్తా చాటింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి (రామకృష్ణాపురం)లోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ఆవరణలో రెండు రోజులుగా జరుగుతున్న 54వ కేవీస్‌ హైదరాబాద్‌ రీజినల్‌ స్థాయి అండర్‌–17 బాలుర వాలీబాల్‌ పోటీలు హోరాహోరీగా సాగి ఆదివారం ముగిశాయి. విజయవాడ–1 జట్లుపై సత్తెనపల్లి జట్టు గెలిచి టోర్నీ విజేతగా నిలిచింది. వాల్తేరుపై గెలిచి ఖమ్మం జట్టు తృతీయ స్థానం కై వసం చేసుకుంది. అనంతరం బాల, బాలికల జాతీయ జట్లను ఎంపిక చేశారు. బహుమతి ప్రదానోత్సవంలో ఏపీ ఫైర్‌ స్టేషన్‌ అండ్‌ సివిల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ డీఎఫ్‌ఓ సత్యనారాయణ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలన్నారు. విభిన్న రంగాల్లో రాణిస్తేనే ఫలితం ఉంటుందని తెలిపారు. విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు, మెడల్స్‌ ప్రదానం చేశారు. కార్యక్రమంలో సత్తెనపల్లి ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ బి.కిరణ్‌రెడ్డి, రిటైర్డ్‌ పీడీ ఐఏఎస్‌ నాగిరెడ్డి, రిఫరీలు, తదితరులు పాల్గొన్నారు.

బాలుర వాలీబాల్‌ పోటీల విజేత సత్తెనపల్లి 1
1/1

బాలుర వాలీబాల్‌ పోటీల విజేత సత్తెనపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement