ఉండమ్మా.. బొట్టు పెడతా..
రాయగడ: ఈ ఏడాది ఉగాది ఉత్సవాలు ప్రత్యేకతను సంచరించుకోనున్నాయి. ఉత్కళ తెలుగు సమాఖ్య, జిల్లా ఉగాది ఉత్సవ కమిటీ వేర్వేరుగా రెండు వేదికలపై ఉత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో సంబరాలను తిలకించేందుకు వినూత్న రీతిలో పట్టణ వాసులను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా ఉగాది ఉత్సవ కమిటీ మహిళా విభాగానికి చెందిన మహిళలు వీధుల్లో తిరుగుతూ ఇంటింటికీ వెళ్లి, ఆడపడుచులకు బొట్టుపెట్టి ఆహ్వాన పత్రికను అందించడంతో పాటు సంబరాలకు రావాల్సిందిగా కోరుతున్నారు. నువ్వా నేనా అన్న రీతిలో పోటాపోటీగా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక హోటల్ తేజస్విని ఓపెన్ గ్రౌండ్లో నెక్కంటి భాస్కరరావు ఆధ్వర్యంలో జరగనున్న ఉత్సవాల్లో భాగంగా ఈటీవీ జబర్దస్త్ కళాకారులు రామ్ప్రసాద్, రోహిణి, ఇమాన్యూయల్, బాబు తోపాటు యాంకర్లు శ్యామల, అనసూయ భరధ్వాజ్, ప్రముఖ గాయకులు ఎస్పీ చరణ్, కల్పన, ఇండియన్ ఐడిల్ జయంత్, అథితి భవరాజు, ఇమిటేషన్ రాజు పాల్గొనున్నట్లు నిర్వహకులు తెలిపారు.