కూటమి మోసాలపై యువత పోరు | - | Sakshi
Sakshi News home page

కూటమి మోసాలపై యువత పోరు

Jun 24 2025 4:19 AM | Updated on Jun 24 2025 4:19 AM

కూటమి

కూటమి మోసాలపై యువత పోరు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం యువతను, నిరుద్యోగులను నిండా ముంచింది.. 20లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతి నెలకు రూ. 3వేలు ఇస్తామని నమ్మించి మోసం చేసింది.. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా యువతకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదంటూ కూటమి మోసాలపై యువత గళమెత్తింది. విజయవాడ అలంకార్‌ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో సోమవారం వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత, నిరుద్యోగుల పక్షాన యువత పోరు కార్యక్రమం జరిగింది. వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు కొరివి చైతన్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో యువతీయువకులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రూ. 3వేల నిరుద్యోగ భృతి ఎక్కడ? 20లక్షల ఉద్యోగాలు ఏవి? ఉద్యోగాలు పీకుడేగాని, వేసుడు లేదు.. వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు.

వినతిపత్రం అందజేత

నిరసన అనంతరం వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం, విద్యార్థి విభాగం ప్రతినిధులు కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఇలక్కియకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజ, బెల్లందుర్గ, ఇండస్ట్రియల్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ బండి పుణ్యశీల, విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రవిచంద్ర, తోలేటి శ్రీకాంత్‌, దొడ్డా అంజిరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సంపత్‌ విజిత, త్రివేణిరెడ్డి, తోపుల వర్లలక్ష్మి, బూదాల శ్రీనివాసరావు, యువజన విభాగం నియోజకవర్గాల అధ్యక్షులు కేసరి రాజశేఖరరెడ్డి, దేవిశెట్టి శ్రీనివాసరెడ్డి, సీహెచ్‌ సీతారామిరెడ్డి, కార్పొరేటర్లు, పలు విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఏడాది పాలనలో యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు 20 లక్షలు ఉద్యోగాలు ఎక్కడ? రూ.3 వేల నిరుద్యోగ భృతి ఏది? వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో యువత పోరు

అన్ని వర్గాలను మోసం చేస్తున్న చంద్రబాబు అండ్‌కో

కూటమి అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా యువత, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాలను చంద్రబాబు అండ్‌కో మోసం చేసింది. హామీలు అమలు చేయాలని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉందంటూ దాటవేత ధోరణి అవలంబిస్తోంది. తల్లికి వందనం మొదటి ఏడాది ఎగ్గొట్టి రెండో ఏడాది రూ. 2వేలు కోత విధించి అరకొరగా వేసింది. 19 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ. 1500 ఇస్తానని ఈ రోజుకు కూడా ఆ పథకం గురించి మాట్లాడటం లేదు. ఉచిత బస్సు, రైతులకు రూ.20 వేలు ఆర్థిక సాయం, ప్రధానంగా యువతకు నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాల కల్పన ఇవన్నీ చేస్తామని చెబితే నమ్మి ఓట్లేశారు. వైఎస్‌ జగన్‌ ఐదేళ్ల పాలనలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశారు. మేనిఫెస్టోలో 99శాతం హామీలు అమలు చేసిన ఏకై క నాయకుడు వైఎస్‌ జగన్‌. కరోనా సమయంలో కూడా ప్రజలకు అండగా నిలిచారు. లక్షలాది ఉద్యోగాలు ఇచ్చారు. సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందించారు. కానీ కూటమి ఏడాది పాలనలోనే అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు.

–దేవినేని అవినాష్‌,

వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు

కూటమి మోసాలపై యువత పోరు 1
1/3

కూటమి మోసాలపై యువత పోరు

కూటమి మోసాలపై యువత పోరు 2
2/3

కూటమి మోసాలపై యువత పోరు

కూటమి మోసాలపై యువత పోరు 3
3/3

కూటమి మోసాలపై యువత పోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement