
కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
వర్షంలోనూ తరలివచ్చిన భక్తజనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): జేష్ట పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ బుధవారం ఉదయం అంగరంగ వైభవంగా కొనసాగింది. ఇంద్రకీలాద్రి ఘాట్రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభం కాగా, ప్రచార రథంపై ఆది దంపతులకు ఆలయ ఈవో శీనానాయక్ పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రత్యేక వాహనంపై కాకుండా ప్రచార రథంతో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ప్రచార రథం ముందుకు సాగగా, భక్తులు అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు.
అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ కుమ్మరిపాలెం, నాలుగు స్థంభాల సెంటర్, విద్యాధరపురం, సితార జంక్షన్, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కొత్తపేట నెహ్రూబొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి మీదుగా ఆలయానికి చేరుకుంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపించుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్గా డాక్టర్ సమరం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రెడ్క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఎన్నికై ంది. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బుధవారం ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా వార్షిక సర్వ సభ్య సమావేశం జరిగింది. సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్గా డాక్టర్ జి.సమరం, వైస్ చైర్మన్గా డాక్టర్ వెలగా జోషి, కార్య దర్శిగా చిట్టిబాబు, కోశాధికారిగా జి.బాబ్జి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ టి.విజయలక్ష్మి, ఎం.అనురాధ, డాక్టర్ కొల్లేటి రమేష్, కర్లపాటి శ్రీనివాసరావు, ఎం.బలరాం, పి.సుధాకర్, ఎన్.జోసెఫ్ జోషి, కె. జయరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ సలహాదారుగా డాక్టర్ ఎంసీదాస్, డాక్టర్ కె.పట్టాభిరామయ్య, జీవీ రామారావు నియమితులయ్యారు. సమావేశానికి జిల్లా కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించగా పీసీఆర్ రాజు పరిశీలకులుగా వ్యవహరించారు.
వైఎస్సార్ సీపీ యువజన విభాగ కమిటీ నియామకం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగ కమిటీ నియామకం జరిగింది. జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులుగా తిరుమలశెట్టి రాజేష్కుమార్, తోట హరీష్, ప్రధాన కార్యదర్శులుగా మిండల జోషి కుమార్, దామినేని శివరామ్, షేక్ కరీముల్లా, పాల్వంచ రమేష్బాబు, జీతం వెంకట నాగేశ్వరరావు, గోగినేని సాయి సుభా ష్, పోట్రు శశాంక్, కార్యదర్శులుగా షేక్ ఇర్ఫాన్, బొడ్డు తరుణ్, ఎండీ ఆసిఫ్ అజీజ్, కర్ల అజిత్కుమార్, గూడపాటి రామకృష్ణ, పోతురాజు, గొట్టా హరీంద్ర బాబు, అమ్మనబోయిన గోపి, వల్లంకొండ సురేష్, యర్రగుంట సుకుందరావు, చింతల ప్రసాద్ రెడ్డి, శ్రీరాజ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా చట్టు దుర్గా సాయి, సైకం సాగర్, తోడేటి ప్రదీప్ కుమార్, ఈశ్వర్ దుర్గారెడ్డి, షేక్ అర్మన్ అహ్మద్, యర్రబోయిన నాగరాజు, ముద్రబోయిన మహేష్బాబు, జక్కులూరి వెంకటరావు, బేతంపూడి సాంబశివరావు, కొంగల రవీంద్ర, బత్తుల వెంకట నరసయ్య, నారోజు కృష్ణ శర్మ, వలసల అఖిల్, మాదు జయరాంబాబు నియమితులయ్యారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.