
అరాచకాలు చూపిస్తే బ్యాన్ చేస్తున్నారు..
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను చూపిస్తున్న చానళ్లు ప్రసారం కాకుండా బ్యాన్ చేస్తున్నారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. వారిని బెదిరించి, భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికే అప్పుల ఊబిలో ఉందని, ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేక పోయిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదన్నారు. మహిళలపై దాడులు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని, మహిళా హోం మంత్రి అయి ఉండి ఏమి మాట్లాడుతున్నారో తెలియడంలేదని విమర్శించారు. క్రిమినల్ని ట్రీట్ చేసినట్లు కొమ్మినేనిని చూడటం దుర్మార్గమన్నారు.