ఆస్ట్రేలియాలో హైదరాబాదీ యువకుడి అదృశ్యం? ఆందోళనలో కుటుంబం | A Person From Hyderabad Missing In Australia | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో హైదరాబాదీ యువకుడి అదృశ్యం? ఆందోళనలో కుటుంబం

Jan 6 2022 1:51 PM | Updated on Jan 6 2022 2:05 PM

A Person From Hyderabad Missing In Australia - Sakshi

ఉన్నత విద్య కోసం ఆ‍స్ట్రేలియా వెళ్లిన ఓ యువకుడు అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. వారం రోజులుగా ఆ యువకుడి ఆచూకీ తెలియక పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

నగరంలోని మహ్మద్‌ మోసిన్‌ అలి మాజ్‌ (28) అనే యువకుడు మాస్టర్స్‌ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ మెల్‌బోర్న్‌ దగ్గర ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే 2021 డిసెంబరు 30 నుంచి కుటుంబంతో అతని సంబంధాలు తెగిపోయాయి. చివరి సారిగా క్లేటన్‌ సౌత్‌ దగ్గర ఉన్నట్టుగా తెలిసింది. 

మహ్మద్‌ మోసిన్‌ అలిమాజ్‌ ఆచూకీ తెలియక పోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే బాధితుడి సోదరుడు సోషల్‌ మీడియా ద్వారా తన సోదరుడి అదృశ్యం గురించిన వివరాలు వెల్లడించాడు. ఆచూకీ తెలిస్తే చెప్పాల్సిందిగా కోరాడు. మరోవైపు హైదరాబాదీ యువడకుడి అదృశ్యంపై ఆస్ట్రేలియాలో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు విక్టోరియా పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకుడి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement