
కార్మికుల సేవతోనే ఆస్పత్రికి మంచిపేరు
నిజామాబాద్నాగారం: జీజీహెచ్లో నిర్వహించే కార్మికుల సేవతోనే ఆస్పత్రికి మంచిపేరు వస్తుందని జీజీహెచ్ సూపరిండెంట్ శ్రీనివాస్ అన్నారు. మేడేను పురస్కరించుకొని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం ఉత్తమ కార్మికులకు జ్ఞాపికలు అందజేశారు. జీజీహెచ్లో విధులు నిర్వహించే సిబ్బంది మేడే స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేసి ఆస్పత్రిని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని అన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, డిప్యూటీ సూపరింటెండెంట్ తిరుపతిరావు, ఏడీ రాజశేఖర్, నర్సింగ్ గ్రేడ్–2 సూపరింటెండెంట్ చంద్రకళ, నాయకులు హైమద్బేగం, స్వరూప, భారతి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.