
‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ బీజేపీ లక్ష్యం
నిజామాబాద్ సిటీ: ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అనే విధానం దేశానికి చాలా అవసరమని, ఇదే బీజేపీ ఆలోచనా విధానమని దీంతో జాతీయ సమైక్యత, సమర్ధతను తీసుకువచ్చేందుకు దోహదపడుతుందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. నగరంలోని బీజేపీ జిల్లా కా ర్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీసీ కులగణన చేశామని కాంగ్రెస్ గొప్పలు చెప్పు కుంటోందని, వాస్తవానికి జనగణన అనేది కేంద్ర పరిధిలోని అంశమన్నారు. కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్ 2021లోనే జనగణన చేస్తామని ప్రకటించా రని గుర్తుచేశారు. రాహుల్గాంధీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఒకమాట, విపక్షంలో ఉన్నప్పుడు మరోమాట మాట్లాడతారని విమర్శించారు. కులగణనను కాంగ్రెస్ రాజకీయం చేస్తోంద ని ఎద్దేవా చేశారు. పేద ప్రజల కోసం కేంద్రం ఎన్నో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. ఓబీసీలకు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు చిత్తశుద్ధి లేదన్నారు. బీజేపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు. ఓబీసీ జాతీయ కమిషన్కు చట్టబద్ధ హోదా ఇచ్చిందని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ కవిత కొత్తగా బీసీ నినా దం ఎత్తుకోవడంపై ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్లో ఇంటిపోరు నడుస్తోందని, దాంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సాహసోపేత నిర్ణయమని ప్రపంచం ప్రశంసిస్తుంటే, కాంగ్రెస్ ఎంపీలు అనుచిత విమర్శలు చేయడం బాధాకరమన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. విలేకరుల సమావేశంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేశ్, నాయకులు స్రవంతిరెడ్డి, పద్మారెడ్డి, పోతనకర్ లక్ష్మీనారాయణ, మాస్టర్ శంకర్, సాయి వర్ధన్, వెల్డింగ్ నారాయణ, తారక్ వేణుగోపాల్, బాలాపురం ఆనంద్ రావు, కోడూరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం
పేదల కోసం ఎన్నో సంక్షేమ
పథకాలు అమలు
బీఆర్ఎస్ ఇంటిపోరుతో
బీజేపీకి సంబంధం లేదు
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు,
రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్