సుభాష్నగర్: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ విమర్శించారు. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీల అమల్లో ఘోరంగా విఫలమయిందని ఆరోపించారు. నగరంలోని ధర్నాచౌక్లో శుక్రవారం బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పాట్కూరి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ‘రైతు సత్యాగ్రహ దీక్ష’ నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... అకాల వర్షాలు, కరెంట్ కొరత కారణంగా పంటలు ఎండిపోయిన రైతులకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించాలన్నారు. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుపై కాంగ్రెస్ నేతలు అసహనం చూపుతున్నారని, కానీ పసుపు రైతులకు ఇది ఎంతో ఉపయోగకరమన్నారు. వరి కోతలు ప్రారంభమైనందున వెంటనే ఐకేపీ కేంద్రాలు ప్రారంభించి, సకాలంలో కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలపై ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిన్న రాజులు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, శ్రీనివాస్రెడ్డి, రవీందర్రెడ్డి, హరీష్రెడ్డి, భరత్ భూషణ్, ప్రదీప్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే
ధన్పాల్ సూర్యనారాయణ
నగరంలో బీజేపీ రైతు సత్యాగ్రహ దీక్ష