ఇక్కడ ‍డ్రామాలొద్దు.. విపక్షాలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి | No Drama here PM Modi Appeal to the Opposition Amid Parliament Session | Sakshi
Sakshi News home page

ఇక్కడ ‍డ్రామాలొద్దు.. విపక్షాలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి

Dec 1 2025 10:55 AM | Updated on Dec 1 2025 10:57 AM

No Drama here PM Modi Appeal to the Opposition Amid Parliament Session

సాక్షి, ఢిల్లీ: ప్రజా స్వామ్యంలో ప్రతిపక్షానిది కూడా కీలక పాత్రేనని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు సోమవారం పార్లమెంట్‌ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. సమావేశాలకు సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేస్తూనే మరోవైపు మండిపడ్డారాయన.  

బిహార్‌ ఎన్నికల్లో ప్రజలు అత్యధిక ఓటింగ్‌తో ప్రజాస్వామ్యాన్ని బలపరిచారు. పదేళ్లుగా వీళ్లు ఆడుతున్న డ్రామాలను దేశం నమ్మడం లేదు. పరాజయాన్ని కూడా అంగీకరించే మనసు విపక్షాలకు ఉండడం లేదు. అయితే మీ ఓటమి, నిరాశలకు సమావేశాలను బలి కానివ్వొదు. డ్రామాలు ఆడేందుకు వేరే వేదికలు ఉన్నాయి. చట్ట సభల్లో వద్దు. వికసిత్‌ భారత్‌కు లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. కాబ్టటి మీ సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వండి.. 

.. సమస్యలను గళం వినిపించేందుకు ఎంపీలకు అవకాశమే దొరకడం లేదు. తొలిసారి సభలో అడుగుపెట్టిన వారికి మాట్లాడే అవకాశం ఇవ్వండి. సభ సజావుగా సాగేందుకు సహకరించండి. దేశం కోసం పార్లమెంట్‌ ఏం చేస్తుందో తెలియజేయండి. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరుగుతుందని ఆశిస్తున్నా అంటూ మోదీ  ఆశాభావం వ్యక్తం చేశారు.

డిసెంబర్‌ 1వ తేదీ నుంచి 19 దాకా మొత్తం 15 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. కీలక అంశాలపై చర్చతో పాటు 14 బిల్లుల ఆమోదానికి కేంద్రం ప్రయత్నిస్తుండగా.. ఎస్‌ఐఆర్‌, ఢిల్లీ ప్రాణాంతక వాయుకాలుష్యం, ఎర్రకోట పేలుడు ఘటన, నిరుద్యోగం, ధరల పెరుగుదల తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధం అవుతున్నాయి.

 ఇదీ చదవండి: పార్లమెంట్‌లో ఏపీ గళం వినిపించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement