ఇండిగో గందరగోళం.. అసలేం జరుగుతోంది? | IndiGo Crisis: Flights Cancellation, News On Dec 6th Live Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

ఇండిగో గందరగోళం.. అసలేం జరుగుతోంది?

సీఈవోపై వేటుకు కేంద్రం ఆదేశాలు?

ఇండిగో సీఈవో పీటర్‌ ఎల్బర్స్‌పై వేటుకు కేంద్రం ఆదేశాలు?
ఇండిగోకు భారీ ఎత్తున జరిమానా విధించే అవకాశం
పౌర విమానయాన శాఖతో ఇండిగో అధికారుల అత్యవసర సమావేశం
సంక్షోభం నేపథ్యంలో ఇండిగోపై కఠిన చర్యలకు సిద్ధమైన కేంద్రం
ఇండిగోకు భారీ ఎత్తున జరిమానా విధించే అవకాశం

 

2025-12-06 18:33:34

కొత్త ఎఫ్‌డీటీఎల్‌ నిలిపివేత తాత్కాలికమే..

కొత్త ఎఫ్‌డీటీఎల్‌ పూర్తిగా నిలిపివేయలేదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు స్పష్టం చేశారు.

ఇటీవల సర్వీసుల్లో అంతరాయం కారణంగా షెడ్యూల్‌ను పునరుద్ధరించేందుకు ఇండిగో ఏ320 విమానాలకు మాత్రమే సడలింపులు ఇచ్చినట్లు చెప్పారు.

మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో పూర్తిగా ఎఫ్‌డీటీఎల్‌ రూల్స్‌ను విరమించుకుంటుందనే ఆరోపణలొస్తున్నాయి.

దాంతో గందరగోళం నెలకొనడంతో ఈమేరకు అధికారి వివరణ ఇచ్చారు.

2025-12-06 18:04:48

అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 35 విమానాలు రద్దు

అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన 35 ఇండిగో విమానాలను రద్దు చేశారు.

వడోదర విమానాశ్రయంలో మూడు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.

రాజ్‌కోట్ విమానాశ్రయంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ముంబైకి వెళ్లే ఒక ఇండిగో విమానం మాత్రమే రద్దు అయింది.

ఢిల్లీ, ముంబై, గోవా, హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లే ఏడు సర్వీసులు షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నట్లు తెలుస్తుంది.

2025-12-06 17:56:49

నిన్నటితో పోలిస్తే సర్వీసుల్లో అంతరాయం తక్కువే: ఇండిగో

నిన్నటితో పోలిస్తే విమానాల రద్దు లేదా ఆలస్యం తగ్గిందని ఇండిగో తెలిపింది.

ఈమేరకు ప్రెస్‌నోట్‌ విడుదల చూస్తూ 850 కంటే తక్కువ విమాన సర్వీసుల్లో అంతరాయం ఉందని చెప్పింది.

ప్రయాణికులు ఫ్లైట్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌ లింక్‌కు అందించింది.

దాంతోపాటు టిక్కెట్‌ ధరల రీఫండ్‌ స్టేటస్‌ను తెలుసుకునేందుకు వీలుగా లింక్‌ వివరాలు ఇచ్చింది.

2025-12-06 17:47:08

విమాన ఛార్జీలపై పరిమితులు విధించిన కేంద్రం

విమానయాన మంత్రిత్వ శాఖ దేశీయ విమానాలపై ఛార్జీల పరిమితులను విధించింది.

పన్నులు మినహాయించి దూరాన్ని బట్టి కొత్త గరిష్ట ఛార్జీలు ఎంత ఉండాలో తెలిపింది.

రూ .7,500 నుంచి గరిష్టంగా రూ .18,000 వరకు ఛార్జీలు ఉండాలని చెప్పింది.

ఈ తాత్కాలిక ఆంక్షలు పరిస్థితి సద్దుమణిగే వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది.

2025-12-06 17:39:43

విమానాల ఆలస్యం.. పెరిగిన ట్యాక్సీ ధరలు

విమానాల ఆలస్యం వల్ల డిమాండ్ పెరగడంతో ట్యాక్సీ ధరలు మూడు రెట్లు పెరిగాయి.

దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ట్యాక్సీ ధరలు పెంచారు.

విమానాల రద్దు వల్ల టాక్సీ బుకింగ్‌లు పెరిగాయి.

ఢిల్లీ విమానాశ్రయ ప్రయాణికుల కోసం రోజుకు దాదాపు ఒక్కో డ్రైవర్‌కు 50 బుకింగ్‌లు వస్తున్నాయని టాక్సీ యూనియన్లు తెలిపాయి.

2025-12-06 17:22:59

రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికుల ఇక్కట్లు

ఇండిగో విమానాలు రద్దు కావడంతో అవస్థలు పడుతున్న ప్రయాణికులు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని ఇండిగో యాజమాన్యం
ఇండిగో సంస్థ సమస్యల పరిష్కారంలో రాజకీయ జోక్యం
కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్‌నాయుడు విఫలం

2025-12-06 17:13:34

రేపు రాత్రి 8 గంటలలోపు టిక్కెట్‌ ఛార్జీలు రీఫండ్‌

పెండింగ్‌లో ఉన్న ప్రయాణీకుల టిక్కెట్‌ ఛార్జీలను రేపు రాత్రి 8 గంటలలోపు తిరిగి చెల్లించాలని మంత్రిత్వ శాఖ ఇండిగోకు ఆదేశాలు.

ప్రయాణీకుల లగేజీని కూడా 48 గంటల్లోపు తిరిగి ఇవ్వాలి.

నిర్దేశించిన ఛార్జీల కంటే ఎక్కువ వసూలు చేయవద్దని ఇతర సంస్థలకు ప్రభుత్వం సూచన.

ఈ సూచనలను పాటించకపోతే తక్షణ చర్యలు తీసుకుంటారు.

2025-12-06 17:08:23

తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు

ఇండిగో సంక్షోభంతో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు, చెన్నైకు స్లీపర్‌ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.

శంషాబాద్‌లో అందుబాటులో ఉండే ఈ ఆర్టీసీ స్లీపర్‌ బస్సులు.. సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరనున్నాయి.

రాజమండ్రి, కాకినాడ, విశాఖకు అదనపు బస్సులను కూడా ఆర్టీసీ ఏర్పాటు చేసింది.

విమానాల రద్దుతో భారత రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది.

సికింద్రాబాద్‌-చెన్నై,చర్లపల్లి- కోల్‌కత్తా, హైదరాబాద్‌ నుంచి ముంబైకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.

37 రైళ్లకు 116  కోచ్‌లు జోడించాలని  రైల్వే శాఖ నిర్ణయించింది.

ఇప్పటికే అదనపు బోగీలతో కొన్ని రైళ్లు నడుస్తున్నాయి.

2025-12-06 17:04:41

ఇండిగో సంక్షోభం.. రంగంలోకి మోదీ

ఇండిగో సంక్షోభం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పనితీరుపై మోదీ తీవ్ర అసంతృప్తి
స్వయంగా రంగంలోకి దిగిన ప్రధాని నరేంద్ర మోదీ
విమానాయన శాఖ అధికారులతో నేరుగా ప్రధాని సమీక్ష
ఇండిగో సంక్షోభంపై ప్రధానికి అధికారుల బ్రీఫింగ్
సమీక్షకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడిని పిలవని పీఎంవో?

2025-12-06 16:54:43
Advertisement
 
Advertisement
Advertisement