
గాత్రంతో పాటలకు ఊపిరిపోసిన ఎస్పీ బాలు
నారాయణపేట రూరల్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన గాత్రంతో వేలాది పాటలకు ఊపిరిపోశారని, పాటల ద్వారా తెలుగు భాషను ప్రపంచానికి తెలియచెప్పిన మహనీయుడు అని ఎస్పీ బాలు ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్రెడ్డి అన్నారు. స్థానిక బాలకేంద్రంలో బుధవారం ఎస్పీ బాలు 79వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. అనంతరం ఎస్పీ బాలు పాడిన పలు పాటలను పలువురు గాయకులు ఆలపించారు. వారిని శాలువా, పూలమాల, జ్ఞాపికతో సన్మానించారు. అంతకుముందు బాలు గాయకుడిగా అందించిన సేవలను కొనియాడారు. 18 భాషల్లో 60వేల పాటలను పాడి భారతరత్న అవార్డు సొంతం చేసుకున్నారని అన్నారు. అనంతరం లయన్స్కల్బ్ ఆద్వర్యంలో విద్యార్థులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ గందె కార్తిక్, టీయూడబ్లుజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు కే.నారాయణరెడ్డి, బాలకేంద్రం సిబ్బంది సంగ నర్సింహులు, మోహన్, జ్ఞానామృత, వసంత్, విద్యార్థులు పాల్గొన్నారు.