
వంద రోజుల ప్రణాళిక ప్రారంభం
కోస్గి రూరల్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 100 రోజుల ప్రణాళికను సామవారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయ అవరణలో ప్రారంభించారు. ముందుగా జెండా అవిష్కరణను చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అమరవీరుల పోరాట ఫలితంగానే తెలంగాణ సాధించుకున్నామన్నారు. మున్సిపల్ కార్మికులకు డ్రస్సులు, వర్క్ జాకెట్స్ పంపిణీ చేశారు. ఆనంతరం మున్సిపల్ కార్యాలయం నుండి మెప్మా, మున్సిపల్ కార్మికులతో శివాజీ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. మానవహరం చేపట్టి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో బెజ్జురాములు, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, నాగులపలి నరేందర్, అన్నకిష్టప్ప, రాజేష్, భానునాయక్ పాల్గొన్నారు.