
హనుమాన్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు
నారాయణపేట: హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం జిల్లా పరిధిలో 58 హనుమాన్ శోభాయాత్రలు నిర్వహించడం జరుగుతుందని ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన చౌరస్తాల్లో పోలీస్ పికెట్స్, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ నుంచి మానిటరింగ్ చేస్తామని, సోషల్ మీడియా లో రూమర్లు పోస్ట్ చేసే వారిపై నిఘా ఉంచామని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శోభాయాత్ర జరిగే సమయంలో ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేయా లని తెలిపారు. యువకులు సంయమానం పాటించాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులు వలంటీర్లను ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీస్ వారికి సహకరించాలని తెలిపారు.
నాలుగు కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలి
మరికల్: కార్మికులను కట్టు బానిసత్వంలోకి నెట్టే నాలుగు కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం డిమాండ్ చేశారు. శుక్రవారం మరికల్ మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో సదస్సుకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్వాతంత్రానికి పూర్వం నుండే పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరించి యజమానులకు అనుకూలంగా తీసుకువచ్చిన నాలుగు కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలని అన్నారు. ఈ నాలుగు కోడ్లు అమల్లోకి వస్తే సంఘం పెట్టుకునే హక్కు, సంఘటితంగా ఉండే హక్కు, కనీస హక్కులను కార్మిక వర్గం కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కళావతి, తిరుపతమ్మ, అనురాధ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంగా భవానీప్రసాద్
స్టేషన్ మహబూబ్నగర్: మహబూబ్నగర్ ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం(ఎం)గా ఎస్.భవానీప్రసాద్ బదిలీపై వచ్చారు. ఖమ్మం రీజి యన్లో డిప్యూటీ ఆర్ఎంగా పనిచేస్తున్న ఇత ను ఇటీవల బదిలీపై ఇక్కడికి వచ్చి బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ ఆర్ఎం(ఎం)గా పనిచేసిన శ్యామల హైదరాబాద్లోని మియాపూర్కు బదిలీపై వెళ్లారు.
ముగిసిన జాబ్మేళా
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాబ్మేళాకు 380 మంది విద్యార్థులు హాజరయా ్యరు. టీఎస్కేసీ, సైంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ జాబ్మేళాలో 120 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి అవకాశాలు మరిన్ని వస్తాయని, అందరూ ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐక్యూసీ కో–ఆర్డినేటర్ డా.జె.శ్రీదేవి, టీఎస్కేసీ కో–ఆర్డినేటర్ డా.హరిబాబు, మెంటర్ పి.స్వరూప, సైంట్, టీఎంఐ ప్రాజెక్టు మేనేజర్ వికాస్, ఐసీఐసీఐ బ్యాంకు హెచ్ఆర్ కిరణ్ పాల్గొన్నారు.
వైభవంగా అయ్యప్పస్వామి పంబ ఆరట్టు
స్టేషన్ మహబూబ్నగర్: అఖిలభారత అయ్యప్పదీక్ష ప్రచార సమితి పాలమూరు ఆధ్వర్యంలో శుక్రవారం అయ్యప్పస్వామి పంబ ఆరట్టు (చక్రస్నానం) వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువింటి శ్రవణ్కుమార్ శర్మ, మోనేష్, పవన్ ఆధ్వర్యంలో స్థానిక చెలిమేశ్వర శివాలయం ఊటబావిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గురుస్వామి రఘుపతిశర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ నిర్వహించారు. ప్రచార సమితి అధ్యక్షుడు సీమ నరేందర్, రామేశ్వర్, సతీష్, సంతోష్, శ్రీనుస్వామి, యుగంధర్, సత్యం, రఘురాంగౌడ్, కొండల్, కురుమయ్య పాల్గొన్నారు.

హనుమాన్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు

హనుమాన్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు