
కుల వ్యవస్థపై పోరాడాలి
ఫ కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు
కట్టంగూర్ : సమాజంలోని పేదల ఐక్యతకు అడ్డుగోడగా ఉన్న కుల వ్యవస్థపై పోరాడాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. ఆదివారం కట్టంగూర్ మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ నిర్వహించిన కేవీపీఎస్ జిల్లా స్థాయి శిక్షణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. దళితులకు సంక్షేమ పథకాలు అందడం లేదని, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను నిర్వీర్యం చేశారన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్క లబ్ధిదారునికి రుణం ఇచ్చే పరిస్థితి లేదన్నారు. నిరుద్యోగ యువతకు సబ్సిడీ ద్వారా రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇల్లులేని నిరుపేదలకు ఇళ్ల స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, ఆ సంఘం ప్రతినిధులు కొండేటి శ్రీను, పెంజర్ల సైదులు, రెవిడాల పరుశురాములు, కోడిరెక్క రాధిక, వంటెపాక కృష్ణ, విజయ్కుమార్, గాదె నర్సింహ, దైద శ్రీను, బోళ్లు రవీంద్రకుమార్, దండు రవి తదితరులు పాల్గొన్నారు.