
పేదల సొంతింటి కల సాకారం
నకిరేకల్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ వారి కళ్లలో వెలుగులు నింపుతున్నామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. నకిరేకల్లోని మినీ స్టేడియంలో ఆదివారం ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్థాయి ఇందిరమ్మ ఇళ్ల ధ్రువ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జరగిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆదాయంలో మిగులు రాష్టంగా ఉన్నా గత ప్రభుత్వం 8లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ప్రచారం చేశారు తప్పితే పేదలకు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. మా ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇళ్ల పథకంతో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసి పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం..
కాంగ్రెస్ ప్రజా పాలనలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలండర్, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్యసాయాన్ని రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. ఈ ఏడాది ఉగాది కానుకగా పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రైతు భరోసా కింది ఏడాదికి ఎకరాకు రూ.12 వేల చొప్పున గడిచిన తొమ్మిది రోజుల్లోనే రూ.9 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. గత ప్రభుత్వానికి, నేటి ప్రభుత్వానికి ప్రజలు తేడాను గమనించి కాంగ్రెస్ను దీవించాలని కోరారు. ఎమ్మెల్యే వీరేశం కోరిక మేరకు నకిరేకల్, రామన్నపేటలో తహసీల్దార్ కార్యాలయ భవనాలకు వారం రోజుల్లో నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇళ్ల మంజూరులో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం : భువనగిరి ఎంపీ చామల
భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ పేదవారికి ఇళ్లు ఇవ్వడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ ఫథకాలను ప్రజల్లోకి తీసుకవెళ్లి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేలా ప్రతి కార్యకర్త కృషిచేయాలన్నారు. జిలా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా చేశామన్నారు. స్టీల్, సిమెంట్ తదితర సామగ్రి ధరల నియంత్రణకు మండల స్థాయిలో కమిటీలు వేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుంభం అనిల్కుమార్రెడ్డి, మందుల సామేల్, ఎమ్మెల్సీలు శంకరనాయక్, నెల్లికంటి సత్యం, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్, నాయణఅమిత్, ఆర్డీఓ యానాల అశోక్రెడ్డి, జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్కుమార్, జిల్లా పరిషత్ ఈసీఓ శ్రీనివాస్రావు, నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ, మున్సిపల్ చైర్ పర్సన్లు గుత్తా మంజుల, చౌగోని రజిత, వైస్ చైర్పర్సన్ ఉమారాణి, మాజీ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, వివిధ మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, జిల్లా, మండల స్థాయి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఫ ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
ఫ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల దీవెనలుండాలి
ఫ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
ఫ నకిరేకల్లో ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ
నిబంధనలు సడలించాలి : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిబంధనలు సడలించాలని సూచించారు. ధరణి పోర్టల్తో రైతులు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. అధికార యంత్రాంగం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు.

పేదల సొంతింటి కల సాకారం