కల్వకుర్తి రూరల్: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి స్వాములు, జనంపల్లి సంతోష్ అథ్లెటిక్స్ ఎంపికలను ప్రారంభించగా.. 150 మంది క్రీడాకారులు వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. జూలై 6న హనుమకొండలో నిర్వహించే 11వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్స్ పోటీల్లో పాల్గొనే అండర్–10, 12, 14 బాలబాలికల తుది జట్టును ఎంపిక చేయనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో అంజయ్య, ప్రసాద్, బాలయ్య, రాజేందర్, మల్లేష్, సుభాషిణి, రాజు, సురేశ్, ప్రేమ్ సాగర్, స్వాతి, మల్లయ్య, భాస్కర్, రాజేందర్రెడ్డి పాల్గొన్నారు.
ఉపాధ్యాయ సమస్యలపై నిరంతర పోరాటం
తెలకపల్లి: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఎస్టీయూ నిరంతరం పోరాడుతుందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సదానందంగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కేకే రెడ్డి పాఠశాలలో ఎస్టీయూ రాష్ట్ర, జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు సర్వీస్ సెక్టార్పై మాట్లాడిన మొట్టమొదటి సంఘం ఎస్టీయూ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకోసారి కరువు భత్యం ఇవ్వాలని ప్రతిపాదించి సఫలీకృతమయ్యామని చెప్పారు. యూనియన్ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఉపాధ్యాయులకు అండగా నిలుస్తూ.. సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం సాగిస్తోందన్నారు. 2024 డిసెంబర్ డీఎస్సీ ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఇప్పించేందుకు కృషి చేశామన్నారు. అనంతరం సంఘం నిబంధనలు, నాయకత్వ లక్షణాలను వివరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సుధాకర్రెడ్డి, మురళి, నర్సింహారెడ్డి, సుధాకర్, సైదయ్య, ఈశ్వర్, రఘురాంరెడ్డి, లక్ష్మణరావు, రమేశ్, మండల కార్యదరి జహంగీర్పాషా, బాలస్వామి, వేదావతి, సుఽజాత, సరళ పాల్గొన్నారు.
రామన్పాడులో
1,016 అడుగులు
మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకుగాను ఆదివారం 1,016 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వలకు 12 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు.
ఉత్సాహంగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు