పోలీస్‌ ప్రజావాణికి 12 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ ప్రజావాణికి 12 ఫిర్యాదులు

Jun 10 2025 3:16 AM | Updated on Jun 10 2025 3:16 AM

పోలీస

పోలీస్‌ ప్రజావాణికి 12 ఫిర్యాదులు

నాగర్‌కర్నూల్‌ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు ఎస్పీ రామేశ్వర్‌ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 12 ఫిర్యాదులు అందగా.. 6 భూ తగాదాలపై, 4 వివిధ కేసుల్లో న్యాయం చేయాలని, 2 భార్యాభర్తల గొడవలపై ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.

పేదల పక్షాన

నిరంతర పోరాటం

తాడూరు: పేదల పక్షాన సీపీఐ నిరంతరం పోరాడుతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాల్‌నర్సింహ అన్నారు. సోమవారం తాడూరు మండలం నాగదేవపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అసమానతలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా కమ్యూనిస్టులు పనిచేస్తున్నట్లు తెలిపారు. పేదల జీవన మార్పునకు నాంది పలికిన జెండా ఎర్రజెండా అని అన్నారు. దోపిడీ, అన్యాయం, అణచివేత ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు భరత్‌, నాయకులు వార్ల వెంకటయ్య, జంగన్న ఉన్నారు.

స్పాట్‌ కౌన్సెలింగ్‌

వనపర్తి రూరల్‌: జిల్లాకేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం సీఈసీలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 15న స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు గిరిజన సంక్షేమ కళాశాల ప్రిన్సిపాల్‌ సరస్వతి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కేవలం ఎస్టీ బాలికలకు మాత్రమే అవకాశం ఉంటుందని.. అన్ని ధ్రువపత్రాలతో కళాశాలలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్‌ 94909 57315 సంప్రదించాలని సూచించారు.

పోలీస్‌ ప్రజావాణికి  12 ఫిర్యాదులు  1
1/1

పోలీస్‌ ప్రజావాణికి 12 ఫిర్యాదులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement