
పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావు
మెదక్ కలెక్టరేట్/చిన్నశంకరంపేట(మెదక్): పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు వరమని మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో 311 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ.. గత పాలకులు పదేళ్లలో కుంటిసాకులతో కాలం వెళ్లదీశారే తప్ప ప్రజలకు చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధి దిశ గా ముందుకు సాగుతున్నామని తెలిపారు. విద్యా, వైద్యం ప్రధాన అంశాలుగా తీసుకున్నామని చెప్పారు. రామాయంపేటలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే చిన్నశంకరంపేట మండల కేంద్రంలో 420 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించారు.