సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

Jun 13 2025 7:17 AM | Updated on Jun 13 2025 7:17 AM

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

చేగుంట(తూప్రాన్‌): కాంగ్రెస్‌ పాలనలో ప్రజా సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం చేగుంటలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పటై ఏడాదిన్నర దాటినా పంచాయతీల పాలనను పట్టించుకోవడం లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవకతవకలు జరుగుతున్నా యని వాపోయారు. రామాయంపేటలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదని బాధితుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుత సమయంలో పాఠశాలల నిర్వహణ, వర్షాకాలం సీజన్‌కు సంబంధించి సమీక్షలు నిర్వహించాల్సి ఉండగా, మంత్రులు జిల్లా వైపు తొంగిచూడకపోవడం విడ్డూరమన్నారు. ప్రొటోకాల్‌ పాటించకుండా, ఓడిపోయిన వారు గ్రామాల్లో పర్యటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సమావేశంలో నాయకులు శ్రీనివాస్‌, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌, రాజిరెడ్డి, విశ్వేశ్వర్‌రావు, జర్నల్‌సింగ్‌, యాదగిరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement