
విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు అవసరం
నర్సాపూర్ రూరల్: ప్రతి రైతు విత్తనాల కొనుగోలులో జాగ్రత్తగా ఉండాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ పద్మ, గీత, రంజిత, గాయత్రి రైతులకు సూచించారు. గురువారం మండలంలోని రుస్తుంపేట, అద్మాపూర్లో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొని సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు నాణ్యతా ప్రమాణాలు తెలుసుకోవాలన్నారు. రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలని సూచించారు. పచ్చిరొట్ట ఎరువుల వాడకంతో మంచి దిగుబడి వస్తుందన్నారు. నర్సాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో వరి విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ అధికారి దీపిక తెలిపారు.