
అమ్మ పేరు మీద మొక్క నాటండి
నర్సాపూర్ రూరల్: అమ్మ పేరు మీద మొక్కలు నాటి భావితరాలకు బాసటగా నిలవాలని జిల్లా గ్రామీణాభివద్ధి అధికారి సీహెచ్ శ్రీనివాస్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం నర్సాపూర్ మండలం రామచంద్రాపూర్లో ఐకెపీ ఏపీఎం గౌరీ శంకర్ అధ్యక్షతన జరిగిన గ్రామైక్య మహిళా సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత వర్షాకాలంలో ప్రతి మహిళా బాధ్యతగా అమ్మ పేరు మీద ఒక మొక్క నాటి మూడేళ్లపాటు సంరక్షించాలని సూచించారు. ప్రతి సంవత్సరం రాఖీ కట్టి జాతికి అంకితం ఇవ్వాలని కోరారు. దీంతో మన భావితరాల పిల్లలకు స్వచ్ఛమైన గాలితో పాటు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతామని పేర్కొన్నారు. ఆర్థిక పారదర్శకతలో భాగంగా అన్ని సంఘాల సభ్యులు సామాజిక ఆర్థిక లావాదేవీలపై సమీక్షించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మధులత, ఐకెపి సీసీ దేవిసింగ్, కార్యదర్శి సిఏ నీరజ, గ్రామ సంఘం అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
శ్రీనివాస్ రావు