
రెవెన్యూ సదస్సులతో రైతులకు మేలు
రేగోడ్(మెదక్)/అల్లాదుర్గం(మెదక్): భూ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూ భారతి సదస్సులతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని మెదక్ ఆర్డీఓ రమాదేవి తెలిపారు. రేగోడ్ మండలంలోని వెంకటాపూర్లో, అలాగే.. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్లలో ఏర్పాటు చేసిన సదస్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కరించేందుకే భూభారతిని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలను భూభారతితో మోక్ష లభించనుందని పేర్కొన్నారు.
మెదక్ ఆర్టీఓ రమాదేవి