
సమ్మెను జయప్రదం చేద్దాం
మెదక్ కలెక్టరేట్: జూలై 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కొత్త చట్టాలు తెచ్చి ఏళ్లుగా పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తుందన్నారు. లేబర్ కోడ్స్ అమలు కావడం వల్ల మహిళా కార్మికులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 8 గంటల పనిని, 12 గంటలకు పెంచిందన్నారు. దేశవ్యాప్త సమ్మెతో కేంద్రం కళ్లు తెరిపించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలమణి, మల్లేశం, జిల్లా కోశాధికారి నర్సమ్మ, ఉపాధ్యక్షులు మహేందర్రెడ్డి, నాగరాజు, బస్వరాజు, సహాయ కార్యదర్శులు సంతోష్, నాగేందర్రెడ్డి, అన్నపూర్ణ, గౌరయ్య తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు