
వ్యాక్సినేషన్ ప్రారంభం
పాతమంచిర్యాల: జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల పట్టణ ఆరోగ్య కేంద్రంలో రోటసిల్ లిక్విడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఇంచార్జి డీఎంహెచ్వో డాక్టర్ ప్రసాద్, డెప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ అనిత బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 అర్బన్ హెల్త్సెంటర్లు, 100 ఆయుష్మాన్ భారత్ కేంద్రాల్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. వ్యాక్సిన్ను ఆరు, పది, 14 వారాలు ఉన్న పిల్లలకు ఇస్తామని అన్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు డయేరియా, ఇతర వ్యాధులు రాకుండా అరికడుతుందని, ప్రజలందరూ పిల్లలకు వేయించాలని తెలిపారు. వైద్యులు శివప్రతాప్, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, డీపీహెచ్ఎం పద్మ పాల్గొన్నారు.