ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ఎగువన కురిసిన వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు మంగళవారం సాయంత్రం వరకు 3,052 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండు పంపులను రన్ చేసి రిజర్వాయర్లను నింపుతున్నారు. నెట్టెంపాడుకు 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 1,300 క్యూసెక్కులు వదలగా.. మరో 44 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.864 టీఎంసీల నీరు నిల్వ ఉంది.


