బూర్గుపల్లిలో విషాదం | - | Sakshi
Sakshi News home page

బూర్గుపల్లిలో విషాదం

Jun 29 2025 2:27 AM | Updated on Jun 29 2025 2:27 AM

బూర్గుపల్లిలో విషాదం

బూర్గుపల్లిలో విషాదం

జడ్చర్ల: మండలంలోని బూర్గుపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కావలి శివప్రసాద్‌ (22) హైదరాబాద్‌లోని ఓ న్యాయ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతుండేవాడు. ఈ నెల 17న హైదరాబాద్‌లోని బల్కంపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌ సమీపంలో కారు నిలిపే సమయంలో జరిగిన గొడవలో ఓ యువకుడు పదునైన ఆయుధంతో తలపై పొడవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే చికిత్స కోసం నిమ్స్‌కు తరలించగా ఈ నెల 27న బ్రెయిన్‌ డెడ్‌గా వైద్యులు ధ్రువీకరించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు తమ కుమారుడి అవయవాలు నలుగురికి ఉపయోగపడాలన్న సదాశయంతో అవయవ దానానికి అంగీకరించారు. దీంతో శనివారం రెండు కిడ్నీ లు, కాలేయం, ఊపిరితిత్తులను సేకరించి అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో అంబులెన్స్‌లో బాదేపల్లి రాజీవ్‌నగర్‌ కాలనీలో ఉంటున్న ఇంటికి అక్క డినుంచి స్వగ్రామం బూర్గుపల్లికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఒక్కగానొక్క కు మారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు మహాలక్ష్మి, నర్సింహులు కన్నీరు మున్నీరయ్యారు.

గ్రామానికి చెందిన లా విద్యార్థిహైదరాబాద్‌లో హత్య

అవయవదానంతో పలువురికి స్ఫూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement