మరణంలోనూ వీడని బంధం | - | Sakshi
Sakshi News home page

మరణంలోనూ వీడని బంధం

Jun 29 2025 2:27 AM | Updated on Jun 29 2025 2:27 AM

మరణంల

మరణంలోనూ వీడని బంధం

రెండ్రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతి

పాన్‌గల్‌: మండలంలోని కేతేపల్లిలో రెండ్రోజుల వ్యవధిలోనే వృద్ధ భార్యాభర్తలు మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గడమల నర్సింహ (70), గడమల బాలమ్మ (65) భార్యాభర్తలు. అనారోగ్యంతో నర్సింహ బుధవారం మృతిచెందగా.. దిగాలుతో భార్య బాలమ్మ శనివారం మృతిచెందింది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

విద్యుదాఘాతంతోరైతు మృతి

గోపాల్‌పేట: విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. మండలంలోని పాటిగడ్డ తండాకు చెందిన పాత్లావత్‌ నార్యానాయక్‌(65) పంటను పందుల బెడద నుంచి కాపాడేందుకు శుక్రవారం రాత్రి పొలం చుట్టూ తీగలను ఏర్పాటు చేసి విద్యుత్‌షాక్‌ పెట్టి ఇంటికి వచ్చాడు. ఎప్పటిలాగా శనివారం ఉదయం పంటను చూసేందుకు వెళ్లాడు. వైర్లు తెగిపోయి పడి ఉన్నాయి. దీనిని గమనించకుండా తీగలపై రైతు కాలుపెట్టడంతో విద్యాదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉండగా అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. గోపాల్‌పేట ఎస్‌ఐ నరేష్‌కుమార్‌ను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

క్షణికావేశంలో

మహిళ ఆత్మహత్య

నవాబ్‌పేట: క్షణికావేశంలో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కొండాపూర్‌లో చోటుచేసుకుంది. కొండాపూర్‌కు చెందిన పసుపుల శివలీల(35) కుటుంబ తగాదాలతో క్షణికావేశానికి లోనై ఉరేసుకొంది. మృతురాలి భర్త మల్లేశ్‌ తరచూ మద్యంతాగి భార్యతో గొడవ పడేవాడని.. శుక్రవారం గొడవ జరగడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొంది. గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన డాక్టర్లు మృతిచెందినట్లు తెలిపారు. మృతురాలి తండ్రి రాములు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ విక్రమ్‌ తెలిపారు. శివలీలకు కుమారుడు, కూతురు ఉన్నారు.

గొర్రెల మంద వద్దకు వెళ్తూ అనంతలోకాలకు..

బిజినేపల్లి: మండలంలోని వెల్లగొండకు చెందిన గొర్రెలకాపరి ఈర్ల మాసయ్య (65) శనివారం రాత్రి కొట్టాల్‌గడ్డ దర్గా సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. వెల్లగొండకు చెందిన ఈర్ల మాసయ్య వృత్తిరీత్యా గొర్రెలకాపరి. శనివారం చీకటి పడిన తర్వాత గొర్రెల మంద వద్దకు వెళ్లడానికి ఇంటి నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో కొట్టాల్‌గడ్డ వద్ద రోడ్డు దాటుతున్న అతడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య అనిత, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.

మరణంలోనూ వీడని బంధం 
1
1/1

మరణంలోనూ వీడని బంధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement