భూ భారతితో రైతులకు న్యాయం | - | Sakshi
Sakshi News home page

భూ భారతితో రైతులకు న్యాయం

May 1 2025 1:28 AM | Updated on May 1 2025 1:28 AM

భూ భారతితో రైతులకు న్యాయం

భూ భారతితో రైతులకు న్యాయం

అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

చిన్నచింతకుంట: భూ భారతి చట్టంతో ప్రతి పేద రైతుకు న్యాయం జరుగుతుందని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం కురుమూర్తి జాతర మైదానంలో చిన్నచింతకుంట, కౌకుంట్ల మండలాల రైతులకు భూభారతి చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం పేదలకు ఉపయోగపడేలా చట్టాలను అమలులోకి తీసుకొచ్చిందన్నారు. అందుకే రైతుల భూసమస్యలు పరిష్కరించేందుకు భూభారతి చట్టం తీసుకొచ్చామన్నారు. ఈ చట్టం ద్వారా పేద రైతులకు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్‌ 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు.ఈ చట్టం ప్రతి రైతు అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ముందుగా నాలుగు మండలాలను పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేశామన్నారు. త్వరలో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలెట్‌ కింద తీసుకుంటామన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పిస్తూ అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దేవరకద్రలో సబ్‌ రిజిస్ట్రర్‌ కార్యాలయం, కొత్తగా ఏర్పడిన మండలాల్లో రెవెన్యూ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. కలెక్టర్‌ విజయేందరి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లో భూభారతి చట్టంపై సదస్సులు నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ధరణి చట్టం ద్వారా పరిష్కారం కాని భూ సమస్యలు భూ భారతి చట్టం ద్వారా తహసీల్దార్‌ స్థాయిలోనే ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. అందుకు సీఎం రేవంత్‌ ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట మైనార్టీ పైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, అదనపు కలెక్టర్లు మోహన్‌రావు, శివేంద్ర ప్రతాప్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement