
ఎస్ఎంసీకి కొత్త ప్రిన్సిపాల్
డాక్టర్ ఏవైరావు బాధ్యతలు స్వీకరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా అడిషనల్ డైరెక్టర్ హోదాలో డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు(ఏవై రావు) గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకూ ప్రిన్సిపాల్గా వ్యవహరించిన డాక్టర్ పి. అశోక్కుమార్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది ఆయనను కలిసి పుష్ప గుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
క్రమశిక్షణ.. సమయపాలన..
ఈ సందర్భంగా డాక్టర్ ఏడుకొండలరావు మాట్లాడుతూ కళాశాలలో క్రమశిక్షణ ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించేలా చూస్తామన్నారు. నిత్యం కళాశాల, విద్యార్థులు హాస్టల్స్లో రౌండ్స్ వేస్తూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. విద్యార్థులు అకడమిక్ కార్యక్రమాల్లో ప్రోత్సహిస్తానన్నారు. వైద్యులు, సిబ్బంది, వైద్య విద్యార్థులు ఎప్పుడైనా నేరుగా తనను కలవచ్చని, వెయిటింగ్ లేకుండా ఎప్పుడూ తలుపులు చెరిచే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. వైద్యులు సిబ్బందితో సమన్వయం సమష్టి కృషితో ముందుకెళ్దామని పేర్కొన్నారు. కాగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలరావును అభినందించిన వారిలో పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. అశోక్కుమార్, ఏడీ శ్రీకాంత్, ఇతర ప్రొఫెసర్లు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది ఉన్నారు.