
గత ప్రభుత్వమే మేలు..
పండించిన పంట విక్రయించేందుకు ఖాళీ సంచుల కోసం రైస్ మిల్లర్ల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ధాన్యం విక్రయాలకు ఖాళీ సంచులను రైతుభరోసా కేంద్రాల వద్దకు వెళ్లి తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడు మిల్లర్లమీద ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పటికై నా పాత పద్ధతి ద్వారా సేవలందిస్తే బాగుంటుంది. రైతులకు గత ప్రభుత్వంలోనే మేలు జరిగింది.
– షేక్ చాన్బహుదూర్,
రైతు, పెండ్యాల, కంచికచర్ల మండలం