విద్యుత్‌ బిల్లు.. జేబుకు చిల్లు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ బిల్లు.. జేబుకు చిల్లు

Jun 11 2025 11:54 AM | Updated on Jun 11 2025 11:54 AM

విద్య

విద్యుత్‌ బిల్లు.. జేబుకు చిల్లు

● కూటమి పాలనలో ప్రజలకు చుక్కలు చూపిస్తున్న విద్యుత్‌ బిల్లులు ● హామీలను విస్మరించి సామాన్యులపై విద్యుత్‌ చార్జీల భారం ● అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామంటూ ఎన్నికల్లో ప్రచారం ● రకరకాల చార్జీల పేరుతో చూస్తేనే షాక్‌ కొట్టేలా విద్యుత్‌ బిల్లులు ● చంద్రబాబు హామీలను నమ్మి మోసపోయామంటున్న సామాన్య జనం

బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ

– కై లా అశోక్‌,

రైతు, గుడివాడ

గుడివాడరూరల్‌: గత ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ చార్జీలు భారంగా మారాయంటూ చంద్రబాబు సహా కూటమి నాయకులు గగ్గోలు పెట్టారు.. బాదుడే బాదుడు అంటూ ఊరూవాడా అసత్యాల దరువేశారు.. స్మార్ట్‌ మీటర్లు వద్దంటూ రాద్ధాంతం చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలపై విద్యుత్‌ చార్జీలను పెంచబోమని హామీలు గుప్పించారు.. అవసరమైతే ఆ చార్జీలను తగ్గిస్తామని ఎన్నికల ప్రచారంలో గొప్పలు చెప్పారు.. తీరా అధికారంలోకి వచ్చాక నాలుక మడత పెట్టేశారు.. విద్యుత్‌ చార్జీలను అమాంతం పెంచేశారు.. పట్టుకుంటే కాదు.. చూస్తేనే షాక్‌ కొట్టేలా విద్యుత్‌ బిల్లులతో జనానికి చుక్కలు చూపిస్తున్నారు.. బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ.. ఇది సంక్షేమ ప్రభుత్వం కాదు.. భారాల ప్రభుత్వం అని ప్రజలు అనుకునేలా పాలన సాగిస్తున్నారు.

కృష్ణాజిల్లాలో మొత్తం 7,53,295 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 38 వేలకు పైగా వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌లు ఉన్నాయి. ప్రస్తుతం మండుతున్న ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ డిమాండ్‌ రోజురోజుకూ అధికమవుతోంది. మరోవైపు జిల్లాలో వ్యవసాయ బోర్లు ఎక్కువయ్యాయి. కూటమి పాలనలో విద్యుత్‌ బిల్లులు ఏసీ గదుల్లోనూ ప్రజలకు చెమటలు పట్టిస్తున్నాయి.

బిల్లులతో బాదుడే బాదుడు

విద్యుత్‌ వినియోగానికి విరుద్ధంగా బిల్లులు పెరుగు తుండటంతో పేద, మధ్య తరగతి కుటుంబాల గుండెలు గుభేలుమంటున్నాయి. ఒకవైపు ఉక్కపోత, మరో వైపు పెరిగిన విద్యుత్‌ బిల్లులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలను పెంచబోమంటూ ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు ప్రభుత్వం విస్మరిం చింది. ప్రస్తుతం జిల్లాలోని గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు విద్యుత్‌ డివిజన్లకు రోజుకు 7.294 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ ఉంది. వేసవి మరికొద్ది రోజుల్లో ముగిస్తే 20 శాతం విద్యుత్‌ వాడకం తగ్గే అవకాశం ఉంది. ఎండలు మరి కొద్ది రోజులు ఇలానే కొనసాగితే మరో 20 శాతం విద్యుత్‌ వాడకం పెరగనుందని అధికారుల అంచనా. ఈ డిమాండ్‌ మేరకు విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన అన్ని చర్యలను తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే విద్యుత్‌ బిల్లులను మాత్రం మోతెక్కిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లులకు రెట్టింపు మొత్తంలో జారీ చేస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పేదల సంక్షేమమే వైఎస్సార్‌ సీపీ లక్ష్యం

వైఎస్సార్‌ సీపీ హయాంలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా పాలన సాగింది. విద్యుత్‌ వినియోగం పెరిగినా, ప్రభుత్వంపై భారం పడుతున్నా ఒక్క రూపాయి కూడా విద్యుత్‌ చార్జీ పెరగకుండా పేద, మధ్యతరగతి వర్గాలతో పాటుగా ఎంఎస్‌ ఎంఈల అభ్యున్నతి దిశగా యోచన చేసింది. ప్రభుత్వం నుంచి అవసరమైన రుణాలు అందించి యువ పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించింది. పగటి వేళలో తొమ్మిది గంటల పాటు నిరాటంకంగా విద్యుత్‌ను సరఫరా చేసి వ్యవసాయానికి తోడ్పడింది.

స్మార్ట్‌ మీటర్లతో తీవ్ర ఇబ్బందులు

చల్లపల్లిలో వాటర్‌ ప్లాంట్‌ను నడుపుతున్నా. గతంలో ప్రతి నెలా రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు కరెంట్‌ బిల్లు వచ్చేది. గత ఏడాది డిసెంబర్‌లో కూడా రూ.26,754 బిల్లు వచ్చింది. ఈ ఏడాది జనవరి నెలకు రూ.72,619 బిల్లు రావడంతో విద్యుత్‌ ఏఈని సంప్రదించా. ఈ బిల్లు చెల్లించాల్సిందేనని ఏఈ స్పష్టంచేశారు. పాత మీటర్లు ఉన్నప్పుడు ఇంత పెద్ద మొత్తంలో బిల్లులు రాలేదు. స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసినప్పటి నుంచి కరెంట్‌ బిల్లులు అధికంగా వస్తున్నాయి. మా ప్లాంట్‌కు వచ్చిన వచ్చిన విద్యుత్‌ రీడింగ్‌పై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలి.

76 యూనిట్లు విద్యుత్‌ వినియోగానికి 2015–16 టీడీపీ హయాంలో రూ.140.10 బిల్లు వచ్చింది. అన్నే యూనిట్లకు 2018–19లో రూ.197.60 బిల్లు వచ్చింది. ప్రస్తుతం 76 యూనిట్లకు రూ.397 చొప్పున బిల్లులు జారీ చేస్తున్నారు. దీనికి ట్రూఅప్‌, ఎఫ్‌పీపీసీఏ చార్జీలు అదనంగా విధిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హాయంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే 100 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగంపై చార్జీలు ఏపీలో తక్కువగా ఉండేవి. ఇతర చోట్ల యూనిట్‌ రూ.8.26 వరకూ ఉంటే ఏపీలో రూ.3.11 చొప్పునే చార్జీ పడేది. 75 యూనిట్ల వరకు వినియోగానికి టారిఫ్‌ సగటు సరఫరా వ్యయంలో 50 శాతం కంటే తక్కువే విధించారు. వ్యవసాయానికి సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ (సెకీ) ద్వారా ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను సగటు కొనుగోలు ధర యూనిట్‌ రూ.5.10 చొప్పున ఉన్నప్పటికీ గత ప్రభుత్వం రూ.2.49లకే సేకరించేలా చర్యలు తీసుకుంది. దీంతో ఏటా దాదాపు రూ.3,750 కోట్లు ఆదా అయ్యింది. 2021లో విద్యుత్‌ కొనుగోళ్లలో రూ.4,925 కోట్లు ఆదా కాగా ఇందులో రూ.3,373 కోట్లు వినియోగదారులకే తిరిగి ఇచ్చేశారు.

కృష్ణా జిల్లాలో విద్యుత్‌ సర్వీసుల వివరాలు ఇలా..

కేటగిరీ సర్వీసులు

గృహాలు 6,21,578

షాపులు 66,025

పరిశ్రమలు 2,619

ఆలయాలు,కార్యాలయాలు 14,606

వ్యవసాయం 38,179

ఆక్వా 10,288

మొత్తం 7,53,295

టీడీపీ అంటేనే షాకులు

– దాసరి భాస్కరరావు, చల్లపల్లి

విద్యుత్‌ బిల్లు.. జేబుకు చిల్లు 1
1/5

విద్యుత్‌ బిల్లు.. జేబుకు చిల్లు

విద్యుత్‌ బిల్లు.. జేబుకు చిల్లు 2
2/5

విద్యుత్‌ బిల్లు.. జేబుకు చిల్లు

విద్యుత్‌ బిల్లు.. జేబుకు చిల్లు 3
3/5

విద్యుత్‌ బిల్లు.. జేబుకు చిల్లు

విద్యుత్‌ బిల్లు.. జేబుకు చిల్లు 4
4/5

విద్యుత్‌ బిల్లు.. జేబుకు చిల్లు

విద్యుత్‌ బిల్లు.. జేబుకు చిల్లు 5
5/5

విద్యుత్‌ బిల్లు.. జేబుకు చిల్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement