
చిరు ధాన్యాలపై సాగుపై దృష్టి సారించాలి
తిర్యాణి(ఆసిఫాబాద్): రైతులు చిరుధాన్యాలపై దృష్టి సారించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. మండలంలోని మొహింద గుడిపేట గ్రామంలో సోలార్ పంపు సెట్లతో సాగు చేస్తున్న చిరుధాన్యాల పంటను మంగళవారం పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశం నిర్వహించారు. పీవో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో పండించే కూరగాయలను ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేసి రైతులకు ధర గిట్టుబాటు అ య్యేలా చూస్తామన్నారు. మండలంలో త్వరలోనే ఐటీడీఏ ఆధ్వర్యంలో దాల్మిల్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రా మంలో బావి ఏర్పాటు చేయాలని గ్రామస్తులు పీవో దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఐటీడీఏ జేఈ బద్రోద్దీన్, గ్రామ పటేల్ మడావి భీంరావు, ఆత్రం భీంరావు, రైతులు భుజంగరావు, జలపతిరావు, పైకు తదితరులు పాల్గొన్నారు.