
పరిశ్రమలకు ఈ–ఖాతా వర్తించదు
రాయచూరు రూరల్: ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాటికి ఈ–ఖాతాలను చేయించుకోవాలంటూ తీసుకున్న నిర్ణయాన్ని సిటీ కార్పొరేషన్ అధికారులు ఉపసంహరించుకోవాలని కాటన్ మిల్లర్స్ సంఘం అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమలు, హౌసింగ్, ఏపీఎంసీ, కేఏఐడీబీ, కేఎస్ఎస్ఐడీసీ వంటి వాటికి ప్రభుత్వమే కావేరి–2.0లో తీసుకుంటుందని, లేకపోతే సబ్ రిజిస్త్ట్రార్ కార్యాలయంలో అధికారులు నమోదు చేసుకోవడానికి వెనుకాడుతున్నారని ఆరోపించారు. సర్కారు ఈ నిర్ణయంపై సరైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. నగరసభ అధికారులు ఈ విషయంలో పునరాలోచించాలన్నారు.