
నకిలీ విత్తనాల బెడద అరికట్టండి
● అధికారులకు డివిజనల్
కమిషనర్ సూచన
రాయచూరు రూరల్: కలబుర్గి డివిజన్లో అధికమవుతున్న నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టాలని వ్యవసాయ శాఖ కలబుర్గి డివిజన్ కమిషనర్ వైఎస్ పాటిల్ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని వ్యవసాయ వర్సిటీ పాలక మండలి భవనంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయచూరు, బీదర్, కొప్పళ, బళ్లారి, యాదగిరి, కలబుర్గి, విజయనగర జిల్లాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుంచి పత్తి, పొద్దు తిరుగుడు, సజ్జ, కంది వంగడాల నకిలీ విత్తనాలను విక్రయించడానికి వచ్చేవారి వద్ద లైసెన్సులను గుర్తించి, నకిలీ విత్తనాలు కొనుగోలు చేయకుండా రైతులను చైతన్యపరచాలన్నారు. 2025–26వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాల నియంత్రణకు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక కమిటీలను నియమించామన్నారు. ఖరీఫ్లో మంచి వర్షాలు పడ్డాయని, రైతులకు అందుబాటులో ఉండేలా రైతు కేంద్రాలు పని చేయాలన్నారు. సమవేశంలో వ్యవసాయ వర్సిటీ వైస్ చాన్సలర్ హన్మంతప్ప, బెంగళూరు వాటర్షెడ్ కమిషనర్ మహేష్ శిరూరు, డైరెక్టర్ పుత్ర, వెంకటరామరెడ్డి, పాటిల్, అనూస్, అంథోని, సదాశివ, జయ ప్రకాష్, మల్లికార్జున, దీపా, శ్రీనివాస్, గురునాథ్, నజీర్ అహ్మద్లున్నారు.

నకిలీ విత్తనాల బెడద అరికట్టండి