
నోరూరించే మామిడి, పనస మేళా
మైసూరు: మైసూరు నగరంలోని కుప్పణ్ణ పార్క్కు వెళితే నోరూరుతుంది, కారణం.. తీయగా సువాసనలు వెదజల్లే మామిడి, పనస పండ్ల రాశులే. ఈ పండ్ల మేళాను శుక్రవారం ప్రారంభించారు. ప్రజలు పెద్దసంఖ్యలో వచ్చి పండ్లను కొనుగోలు చేశారు. రైతులకు, ప్రజలకు దళారుల బెడద లేకుండా నాణ్యమైన పండ్లను చవక ధరకే అందేలా ఈ మేళా ఏర్పాటు చేసినట్లు జిల్లా పంచాయతీ, రెవెన్యూ, ఉద్యానవన అధికారులు తెలిపారు. మూడు రోజుల పాటు సాగే మేళాలో 12 జాతులకు చెందిన మామిడి, వివిధ రకాల పనస పండ్లు కొలువుతీరాయి. 47 స్టాల్స్ ఏర్పాటయ్యాయి. ఒక స్టాల్లో 12 రకాల మామిడి పండ్లు అమ్ముతున్నారు. స్థానిక ఎమ్మెల్యే హరీష్ గౌడ, అధికారులు హెచ్.ఎం.నాగరాజు, మంజునాథ్ అంగడి, హబీబా, మమత సందర్శించి పండ్లను కొనుగోలు చేశారు.
మైసూరులో షురూ