రాయచూరు రూరల్: నగరంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాల విషయంలో జరిగిన తగాదాలో ఓ యువకుడు హత్యకు గురైన ఘటన చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారు జామున షియాతలాబ్ కాలనీలో మారణాయుధాలతో ఇరువర్గాలు దాడి చేసుకున్నారు. శివకుమార్ అనే వ్యక్తి రమేష్, ఓంసింగ్లపై దాడి జరిపిన నేపథ్యంలో ఓంసింగ్ మరణించాడు. రమేష్ పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్పీ పుట్టమాదయ్య వెల్లడించారు. సదర్ బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఉమేష్ కాంబ్లే తెలిపారు.
హత్య కేసులో నిందితుల అరెస్ట్
నగరంలో అన్నదమ్ముల మధ్య ఆస్తుల పంపకాల విషయంలో జరిగిన తగాదాలో యువకుడు హత్యకు గురైన ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం తెల్లవారు జామున షియా తలాబ్లో మారణాయుధాలతో దాడి చేసిన ఘటనలో ఓంసింగ్ మరణించాడు. ఘటనకు సంబంధించి శివ(20), బ్రిజ్పాల్(48), బాలిక(43), పవన్(21)లను అరెస్ట్ చేసినట్లు సదర్ బజార్ పోలీస్ స్టేషన్ సీఐ ఉమేష్ కాంబ్లే తెలిపారు.
ఆస్తి తగాదాలో యువకుడి హత్య
ఆస్తి తగాదాలో యువకుడి హత్య
ఆస్తి తగాదాలో యువకుడి హత్య
ఆస్తి తగాదాలో యువకుడి హత్య
ఆస్తి తగాదాలో యువకుడి హత్య