వంటికి యోగా మంచిదేగా | - | Sakshi
Sakshi News home page

వంటికి యోగా మంచిదేగా

May 2 2025 1:55 AM | Updated on May 2 2025 1:55 AM

వంటిక

వంటికి యోగా మంచిదేగా

హొసపేటె: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా పౌర సేవకులను స్వాగతిస్తూ హరిద్వార్‌కు చెందిన యోగా గురువు స్వామి పరమార్థ దేవ్‌జీ ప్రత్యేక ఇంటిగ్రేటెడ్‌ అడ్వాన్స్‌డ్‌ యోగా శిక్షణ శిబిరం గురువారం నుంచి ప్రారంభించారు. ఇక్కడి మల్లిగె హోటల్‌ ప్రాంగణంలో ఉదయం 5.30 గంటలకు ప్రారంభమైన ప్రత్యేక యోగా శిబిరాన్ని పతంజలి యోగా పీఠం కేంద్ర ఇన్‌చార్జి, బాబా రామ్‌దేవ్‌ సన్నిహిత శిష్యుడు స్వామి పరమార్థ దేవ్‌జీ ప్రారంభించి మాట్లాడారు. కులం, మతం అనే తేడా లేకుండా అందరూ యోగా చేయవచ్చనే దైవిక సందేశం పంపారు. తరువాత స్వామీజీ పౌర కార్మికులను పిలిచి ప్రతి ఒక్కరికీ రుద్రాక్ష మాల వేసి, జ్ఞాపికను ఇచ్చి సత్కరించారు. పది మందికి పైగా కార్మికులను స్వాగతించిన తర్వాతే ప్రత్యేక యోగా శిబిరం ప్రారంభించారు. ఇలా కార్మిక దినోత్సవాన్ని అర్థవంతంగా జరుపుకున్నారు. నగరాలు, పట్టణాల పరిశుభ్రతకు పౌర కార్మికుల సేవలు అవసరమన్నారు. మన శరీరంలో స్వచ్ఛతకు యోగా అవసరమని స్వామీజీ పేర్కొన్నారు. నగరంలోని సేక్రెడ్‌ హార్ట్‌ కాథలిక్‌ చర్చి పూజారి ఫాదర్‌ భగవంత్‌ రాజ్‌, హంసాంబ శారదాశ్రమానికి చెందిన మాతాజీ ప్రబోధామయి పాల్గొన్నారు.

హరిద్వార్‌ యోగా గురువు స్వామి

పరమార్థ దేవ్‌జీ

ప్రత్యేక ఇంటిగ్రేటెడ్‌ అడ్వాన్స్‌డ్‌

యోగా శిక్షణ శిబిరం

వంటికి యోగా మంచిదేగా 1
1/1

వంటికి యోగా మంచిదేగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement